Skip to main content

Noble Persons in History - చండ్ర రాజేశ్వర రావు !!


సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు..చండ్ర రాజేశ్వర రావు జయంతి నేడు(6-June)..

■ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గుర్తింపు, గౌరవం పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇద్దరిలో ఒకరు చండ్ర రాజేశ్వరరావు, రెండవ వారు అజరు కుమార్‌ ఘోష్‌.
■ రాజేశ్వరరావు తీరాంధ్ర ప్రాంతపు సంపన్న  కమ్మరైతు కుటుంబంలో జన్మించాడు. 28 సంవత్సరాలకు పైగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) కి జాతీయ ప్రధానకార్యదర్శి గా ఉండి 1992లో ఆనారోగ్య కారణాల వల్ల విరమించుకున్నాడు.
■ దేశ సమైక్యతను కాపాడడంకోసం బాబ్రీ మసీదు ను మ్యూజియంగా కాపాడాలని, రాజీ ఫార్ములా ప్రతిపాదించాడు
*■ మానవతావాది అయిన రాజేశ్వరరావు పార్టీ కార్యాలయాలలో పనిచేసే చిన్న కార్యకర్తలను సైతం ఆప్యాయంగా పలకరించేవాడు.*
■ ఆయన కారుగానీ, కార్యదర్శిగాని లేకుండానే పని నిర్వహించారు ఢిల్లీ లో వేసవిలో ఉష్ణోగ్రత భరించరానంత ఉన్నప్ప టికీ కూలర్‌ కాని, ఎముకలు కొరికే చలి ఉన్నా హీటర్‌ కానీ వాడలేదు.
*■పార్టీ క్యాంటీన్‌లో వాలంటీర్లతో కలిసే భోజనం చేసేవాడు."నాకు ఆస్తిపాస్తులు లేవు. నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి నుంచీ ఏమీ తీసుకోలేదు" అనేవాడు.*
■ పంచె కాలిపైకి కట్టి, నెత్తికి తలగుడ్డ చుట్టి గ్రామీణ ప్రజలతో కలిసిపోవడం ఆయన నైజం. గ్రాంథిక భాష వాడడు. ఎదుటివారు తన వైఖరిని, విధానా లను విమర్శించినా చాలాఓపికతో వినేవాడు. 
*■ మహిళలు సభలకు హాజరయ్యేందుకు వీలుగా రాత్రి వేళల్లో సమావేశాలు పెట్టవద్దని సూచించేవాడు.*
■ హరిజన, గిరిజన, మైనారిటీ వర్గాలపై దాడులు జరిగితే వెంటనే స్పందించి స్వయం గావెళ్ళేవాడు.
*■ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఐక్య కార్యాచరణ ముందుకు సాగాలని కోరుకునేవాడు.*
*■ శ్రీశ్రీ 1947లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న చండ్రరాజేశ్వరరావు ను అనుసరించి ఎన్నికల సభల్లో పాల్గొనే వారు. ఈ సమయంలో చండ్ర రాజేశ్వరరావు  నంద్యాల రాజకీయ సభలో శ్రీశ్రీని మొట్ట మొదటి సారి మహాకవి అన్నారు, ఆ తర్వాత సాహిత్యలోకంలోనూ, సాధారణ ప్రజల్లోనూ కూడా శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు స్థిరపడిపోయింది.*
■1969-73లలో జరిగిన వేర్పాటువాద ఉద్యమాల గురించి ఆయన రాసిన వ్యాసల ను చండ్ర రాజేశ్వరరావువ్యాసావళి-1969-73  వేర్పాటువాద ఉద్యమాలు పుస్తకం రూపంలో తెచ్చారు.
*■ అంతర్జాతీయ కమ్యూనిస్టు దృక్పథంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను,  శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళి నందుకు రాజేశ్వరరావును `ఆర్డర్‌ ఆఫ్‌ లెనిన్‌' అవార్డు తో సోవియట్‌ యూనియన్‌, `ఆర్డర్‌ ఆఫ్‌ డెమిట్రోవ్‌' అవార్డుతో బల్గేరియా, అలాగే చెకోస్లోవేకియా, మంగోలియా దేశాలు అవార్డులతో సత్కరించాయి.*
■రాజేశ్వరరావు అనారోగ్యంతో బాధపడు
తూ 1994 ఏప్రిల్9న మరణించాడు.ఆయన స్మారకార్ధం హైదరాబాదు శివార్లలోని కొండాపూర్‌లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు‌ ఫౌండేషన్‌ లో కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 (జూన్ 6, 1915 - ఏప్రిల్ 9, 1994)
                   

Comments