*సంఘటనలు*
1896: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
1909: భౌగోళిక ఉత్తర ధృవాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.
1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 6 ఏప్రిల్ 1930 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది
*జననాలు*
1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (మ.1836)
1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967)
1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త మరియు సాహితీ వ్యాఖ్యాత.
1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త.
1931: నల్లమల గిరిప్రసాద్, ప్రముఖ కమ్యూనిస్టు నేత. (మ.1997)
1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), ప్రముఖ కథా రచయిత.
1956: దిలీప్ వెంగ్సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
*మరణాలు*
1989: పన్నాలాల్ పటేల్ ప్రముఖ గుజరాతీ భాషా రచయిత.
2002: భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు
2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)












Comments
Post a Comment