Skip to main content

మీకు తెలుసా? జలాంతర్గామి విశేషాలు !!

మీకు తెలుసా? జలాంతర్గామి విశేషాలు !!

జలాంతర్గామి (ఆంగ్లం: Submarine) నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. భారత నౌకాదళంలో సింధుఘోష్ ముదలగు జలాంతర్గాములు ఉన్నాయి.

ఆద్యుడు అలెగ్జాండర్‌

ప్రత్యర్ధులు జలగర్భ మార్గాల ద్వారా దొంగదెబ్బ తీసే అవకాశం ఉందని క్రీ.పూ. 332లోనే గుర్తించాడు అలెగ్జాండర్‌. అందుకే జలాల కింద కూడా పహారా కాయాలని అనుచరులను ఆదేశించాడు. ఓ అమోఘమైన ఘంటజాడీ (డైవింగ్‌ బెల్‌) ని రూపొందించి దాన్లో ఆయనే స్వయంగా జలాల్లోకి దిగినట్టు ప్రతీతి!

*డావిన్చీ భయం*

పదిహేనో శతాబ్దం చివర్లో.. విఖ్యాత దార్శనికుడైన లియోనార్డో డావిన్చీ.. జల మధ్యంలోకి దూసుకుపోయే సైనిక పాటవం గురించి ప్రస్తావించాడుగానీ ఇది 'సముద్రాల అడుగునే మట్టుబెట్టే నరహంతక బుద్ధి'కి ఊతం ఇస్తుందని భయపడి, దానిని పక్కనబెట్టేశాడు.

*మొదటి జలాంతర్గమనం*

జలాల లోలోపల మనిషి కదలికలు ఆరంభమైన సంవత్సరం 1620. ఇంగ్లండ్‌లో ఉంటున్న డచ్‌ వైద్యుడు కొర్నీలియస్‌ డ్రబ్బెల్‌ కాస్త ఎక్కువ సమయం నీటిలోపల ఉండి ప్రయాణించేందుకు వీలైన తొలి జలాంతర గమన వాహనం సిద్ధం చేశాడు. గొర్రె తోలుతో కప్పిన చెక్క పెట్టెలాంటి దీని లో- తెడ్డువేసే వారితో సహా మొత్తం 20 మంది ప్రయాణించవచ్చు.

*అంతర్జల హోరాహోరీ*

1776 సెప్టెంబరు. న్యూయార్క్‌ ఓడరేవులో మోహరించిన బ్రిటన్‌ యుద్ధనౌకలపై 'దొంగదాడి'కి అమెరికా సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక యేల్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి డేవిడ్‌ బుష్‌నెల్‌ పైకి కనబడకుండా తాబేలులా నీటిలోనే ప్రయాణించే 'టర్టిల్‌'ను సిద్ధం చేశాడు. లోపలి వ్యక్తి చేత్తో పెడల్స్‌ తిప్పుతుంటే ప్రొపెల్లర్స్‌ సాయంతో నీళ్లలో కదిలిపోతుందిది. ప్రత్యర్ధుల కళ్లు గప్పి.. వాళ్ల ఓడలకు రంధ్రాలు చేసి, వాటిని ముంచెయ్యటం దీని లక్ష్యం.

*ప్రచ్ఛన్నయుద్ధం*

అమెరికాకు చెందిన రాబర్ట్‌ ఫల్టన్‌ 1798లో జలాంతర్గామి లోపలి గోడ చుట్టూ మరో పై గోడ నిర్మించి.. మధ్య ఖాళీలో నీరు నింపేలా 'బలాస్ట్‌ ట్యాంకులు' అమర్చాడు! ఆధునిక జలాంతర్గాముల్లో వాడే బల్లాస్ట్‌ ట్యాంకులకు కూడా ఈ నమూనానే ఆధారం. అమెరికా, రష్యాలు జలాంతర్గాములతోనే ప్రచ్ఛన్న యుద్ధం సాగించాయి.

*తొలి అణు జలాంతర్గామి*

జలాంతర్గాములకు ప్రధాన సమస్య ఇంధనం. తరచూ డీజిల్‌ నింపుకోటానికి పైకివస్తే శత్రువుల కంటబడటం తథ్యం. అణుఇంధనంతో ఈ ఇబ్బంది ఉండదు. ఇలా 1954లో అమెరికా మొట్టమొదటిసారిగా అణుఇంధనంతో నెలల తరబడి నీటిలోనే నడిచే 'యుఎస్‌ఎస్‌ నాటిలస్‌'ను, ఆ తర్వాత బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగ జలాంతర్గాములను రూపొందించింది. 'నాటిలస్‌' కేవలం 8 పౌనుల యురేనియాన్ని ఇంధనంగా తీసుకుని దాదాపు 60,000 మైళ్లు ఏకథాటిగా ప్రయాణించింది. 26,500 టన్నుల సామర్థ్యంతో రష్యా నిర్మించిన టైఫూన్‌ రకానివి అతి పెద్ద జలాంతర్గాములు. 

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...