Skip to main content

చరిత్రలో ఈరోజు / సెప్టెంబర్ 1

చరిత్రలో ఈరోజు / సెప్టెంబర్ 1

సంఘటనలు

1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.

1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది.

1992: 10వ అలీన దేశాల సదస్సు ఇండోనేషియా  లోని జకర్తా లో ప్రారంభమైనది.

1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.

2006: పద్దెనిమిదవ లా కమిషన్ ను, (ఆర్డర్ నంబర్ A.45012/1/2006-Admn.III) తేది 2006 సెప్టెంబర్ 1 న ఏర్పాటు చేసారు. ఇది 2009 ఆగష్టు 31 వరకు అమలులో ఉంటుంది. 2007 మే 28 వరకు జస్టిస్ ఎమ్. జగన్నాధరావు అధ్యక్షుడు. ఆ తరువాత ఎ.ఆర్. లక్ష్మణన్ ను నియమించారు.

2008: భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.

2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.

జననాలు

1945: గుళ్ళపల్లి నాగేశ్వరరావు, ప్రముఖ నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.

1947: పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016)

1972: కోట్ల హనుమంతరావు, రంగస్థల ప్రముఖులు, సినిమా నటులు మరియు రంగస్థల అధ్యాపకులు.

1973: రామ్ కపూర్, భారతీయ టెలివిజన్ నటుడు.

1975: యశస్వి, కవిసంగమం కవి.

మరణాలు

1990: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (జ.1914)

1992: ఎస్.వి.జోగారావు, ప్రముఖ సాహిత్యవేత్త. (జ.1928)

2002: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు మరియు దర్శకుడు. (జ.1929)

జాతీయ / అంతర్జాతీయ దినాలు

🔻ఎల్.ఐ.సి. ఫార్మేషన్ డే

🔻ఉజ్బేకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం

🔻పోషక పదార్థాల వారోత్సవం.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...