Skip to main content

చరిత్రలో ఈరోజు / ఆగస్టు 13

చరిత్రలో ఈరోజు / ఆగస్టు 13

సంఘటనలు

🚩3114 బి.సి : మాయా కేలండర్ మొదలైన రోజు. మాయా నాగరికత అమెరికాలో వెల్లివిరిసింది [1]

🚩0533 : పోప్ జాన్-I ఎన్నికయాడు.

🚩0554 : బైజాంటియమ్ చక్రవర్తి అయిన,జస్టినియాన్, ఇటలీ దేశ పునర్నిర్మాణం ప్రారంభించాడు.

🚩0900 : లోరైన్ల రాజు అయిన జ్వెండిబోల్డ్యుద్ధంలో మరణించాడు.

🚩1099: పాస్చల్ II, పోప్గా ఎన్నికయ్యాడు.

🚩1422: రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్ అనే పుస్తకాన్ని,విలియం కాక్స్‌టన్, అనే ఇంగ్లీష్ ముద్రాపకుడు, ఇంగ్లీషు భాషలో, మొదటిసారిగా ఒక పుస్తకం ముద్రించడు.

🚩1438: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం

🚩1521:స్పానిష్ విజేత హీర్నాందో కోర్టేజ్, అజ్టెక్ ఇండియన్లు నుండి ఇప్పటి మెక్సికో నగరాన్ని, స్వాధీనం చేసుకున్నా డు. వారి నాయకుడుటెనోక్టిట్లాన్.

🚩1587: వర్జీనియా లోని రోనోక్కి చెందిన,మాంటియో అనే మొదటి అమెరికా ఆదివాసి,ఇంగ్లాండ్ చర్చి లోకి, ఒక ప్రొటెస్టంట్గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాల్). సర్ వాల్టర్ రాలీ యొక్క "న్యూ వరల్డ్ యాత్ర" లోని సభ్యుల ద్వారా, అతని, మత మార్పిడి జరిగింది.

🚩1642: క్రిస్టియాన్ హుయ్గేన్స్, కుజగ్రహపు దక్షిణ ధ్రువం పైన ఉన్న శిఖారాన్ని (కేప్) గుర్తించాడు.

🚩1654: ఫోల్లి జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు.

🚩1846: అమెరికా జెండాను లాస్ ఏంజిల్స్లోమొదటిసారి ఎగరవేసారు.

🚩1868:పెరూ, ఈక్వెడార్, బొలీవియా దేశాలలోభూకంపం, సునామీ వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం

🚩1889: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి,విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు.

🚩1907: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు),న్యూయార్క్ నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.

🚩1912: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, ఫిలడెల్ఫియా లోని, సెయింట్ జోసెఫ్ కళాశాల,కు మంజూరు చేసింది.

🚩1913: స్టెయిన్‌లెస్ స్టీల్ని హారీ బ్రియర్లీకనుగొన్నాడు.

🚩1923: టర్కీ అధ్యక్షుడుగా ముస్తఫా కెమల్ఎన్నికయ్యాడు.

🚩1930: కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్ నుంచి,లాస్ ఏంజిల్స్ వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి,గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.

🚩1942: వాల్ట్ డిస్నీ యొక్క యానిమేటెడ్ ఫీచర్బాంబి, న్యూయార్క్ నగరంలోని, రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో ప్రదర్శించారు.

🚩1960: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "ఎకో వన్ ఉపగ్రహం సాయంతో జరిగింది.

🚩1961: బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది.బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.

🚩1985: పోప్ జాన్ పాల్ II, కెమరూన్లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన,అమెరికా, యూరప్ ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.

🚩1987: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడుడౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది

🚩1990: ఇరాక్, కువాయిట్ని ఆక్రమించినందుకు,అమెరికా అధ్యక్షుడు బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు.సౌదీ అరేబియా లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.

🚩1990: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు మరియు వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్ మరియు $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, లండన్ లోని అరబ్ బ్యాంకర్లు నివేదించారు

🚩1994: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది

🚩2004: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్లోప్రారంభమయ్యాయి.

🚩2005: బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు.

🚩2006: నెదర్లాండ్స్లో H5N1 బర్డ్ ఫ్లూ ధ్రువీకరించారు.

🚩2006: దావానలం, స్పెయిన్లో కొనసాగుతుంది.

🚩2006: అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం,టొరంటోలో ప్రారంభమయ్యింది.

🚩2007: అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏటా మరణించాడు

🚩2007: భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది.

🚩2007: ఉత్తర అర్థగోళంలో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం.

🚩2007: ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ఈతగాళ్ళు పెరుగుతున్నారు.

🚩2008: చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించాడు

🚩2008: ఒలింపిక్ ముఖ్యాంశాలు: 2008 ఆగష్టు 13

🚩2009: భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబైలో మూసివేతలు ప్రారంభించింది.

🚩2009: మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లోచేర్చేందుకు నిర్ణయించారు.

🚩2009: బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది.

🚩2011: రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; సింహాచలం అప్పన్నకు కరాళచందనంసమర్పించే రోజు.

*జి సైదేశ్వర రావు*

జననాలు

🚩1655: జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్, క్లారినెట్నుకనుగొన్న శాస్త్రవేత్త.

🚩1818: లూసీ స్టోన్, సంఘ సంస్కర్త.

🚩1860: అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్.

🚩1888: జాన్ బైర్డ్, టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చూపిన స్కాటిష్ శాస్త్రవేత్త.

🚩1899: ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్, సినిమా దర్శకుడు,మాస్టర్ ఆఫ్ సస్పెన్స్గా ప్రఖ్యాతుడు.

🚩1926: ఫిడేల్ కాస్ట్రో రుజ్, క్యూబా దేశపు విప్లవకారుడు మరియు నియంత.

🚩1934: ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు.

🚩1952 : హిందీ చలనచిత్ర నటీమణి యోగీతా బాలీ జననం.

🚩1954: రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి.

🚩1963: శ్రీదేవి, సినిమా నటి.

🚩1970: అలన్ షేరర్, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇంగ్లాండు జాతీయజట్టులో స్ట్రైకర్‌గా ఆడాడు.

🚩1975: షోయబ్ అక్తర్, పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు.

మరణాలు

🚩1910: ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (జ.1820)

🚩1978: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (జ.1896)

🚩1988: పైడిమర్రి సుబ్బారావు, మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (జ.1916)

🚩1994: రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1937)

🚩2005: స్నిపర్, శ్రీలంక యొక్క విదేశాంగ మంత్రి.

🚩2008: శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7' 7 1/4" (232 సెంటిమీటర్లు), (జ.1955)

🚩2009: కార్ల్ వాన్ హేస్స్, అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్.

పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳

🚩ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినం.

🚩1960: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్ స్వాతంత్ర్య దినోత్సవము.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...