Skip to main content

చరిత్రలో ఈ రోజు / ఆగస్టు 10

చరిత్రలో ఈరోజు / ఆగష్టు 10

సంఘటనలు

0610: ఇస్లాం మతంలో సాంప్రదాయంగా, అతి పవిత్రమైన లయలత్ అల్ ఖదర్ రోజు. ఈ రోజున, ముహమ్మద్ ప్రవక్త, అతి పవిత్రమైన ఖురాన్ని  అందుకున్నాడు.

1519: ఫెర్డినాండ్ మాగెల్లాన్, ఐదు నౌకలతో, ప్రపంచాన్ని చుట్టిరావడానికి, సెవిల్లె నుండి బయలు దేరాయి.

1680: మెక్సికోలో పెబ్లో (ప్యూబ్లో) ఇండియన్స్, స్పెయిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు.

1743: బహుమతి కోసం యుద్ధం చేయటం గురించిన నియమాలు (పోరాట నియమాలు) ఏర్పరిచినట్లుగా, మొట్టమొదటిగా రికార్డు చేశారు.

1792: లూయిస్ XVI రాజభవంతి పై ఫ్రెంచ్ ప్రజలు దాడి చేసారు.

1821: అమెరికా 24వ రాష్ట్రంగా మిస్సోరిని అమెరిక సెనేట్ అమోదించింది.

1833: చికాగో 200 మంది జనం గల ఒక గ్రామంగా అవతరించింది. పెరిగిన విధానం ఇలా: 1910 సంవత్సరంలో 21, 85, 283; 1920 సంవత్సరంలో 27, 01, 705 (పెరిగిన జనాభా) ; 2010 సంవత్సరంలో 26, 95, 598 (తగ్గిన జనాభా) .

1840: కెనడాలో ఎగిరిన మొదటి బెలూన్ (గాలి గుమ్మటం) పేరు, స్టార్ ఆఫ్ ది ఈస్ట్

1846: స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ను అమెరికాలో స్థాపించారు.

1866: ట్రాన్సాట్లాంటిక్ కేబుల్ ని, అట్లాంటిక్ మహాసముద్రంలో వేశారు. దీనివలన ఖండాంతరం దేశాలకు టెలిఫోన్ సౌకర్యం కలిగింది.

1877: రైలు ప్రయాణాన్ని, మొదటిసారిగా, టెలిఫోన్ వాడుతూ (నియంత్రిస్తూ) పంపించారు.సిడ్నీమైన్స్ రైల్వే దగ్గర ఉన్న, గ్లేస్ బేలో ఉన్నటువంటి, కాలెడోనియా మైన్ (గని) వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ గని యజమానులో, ఒకడైన, అలెగ్జాండర్ గ్రాహంబెల్ మామగారైన, గార్డినెర్ జి. హబ్బర్డ్, రెండు టెలిఫోన్లు పెట్టి, వాటి ద్వారా రైలు ప్రయాణాన్ని నియంత్రించాడు.

1893: జర్మనీ లోని ఆగస్బుర్గ్ వద్ద 1893 ఆగష్టు 10, నాడు రుడాల్ఫ్ డీజిల్ యొక్క ప్రధాన మోడల్ (10 అడుగుల సిలిండర్, ఒక చక్రం) మొదటిసారి తన సొంత శక్తి (వేరుశనగ నూనె) తో పరుగులు పెట్టింది. ఈ కారణంగా, ఆగష్టు 10వ తేదీని ఇంటర్నేషనల్ బయోడీజిల్ డే, (ప్రపంచ శాకాహార నూనె దినం) పాటిస్తున్నారు.

1945: జపాన్ చక్రవర్తి హిరోహితో యొక్క హోదా, యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించింది1948: అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎ.బి.సి.) నెట్‌వర్క్ టి.వి దశ లోకి ప్రవేశించింది.

1958: యు.ఎస్.ఎస్. స్కేట్ అమెరికా యొక్క మూడవ అణు జలాంతర్గామి. ఇది, ట్రాన్స్-అట్లాంటిక్ (అట్లాంటిక్ మహాసముద్రం అవతల నుంచి ఇవతల వరకు) దాటింది. ఉత్తర ధృవం చేరిన రెండవ అణు జలాంతర్గామి. ఉత్తర ధృవం సముద్ర జలాల నుంచి పైకి వచ్చిన మొదటి అణు జలాంతర్గామి.

1961: అమెరికా సైన్యం మొట్టమొదటిసారిగా వియత్నాం దక్షిణ ప్రాంతంలో ఏజెంట్‌ ఆరెంజ్‌(ఎఒ)/ డయాక్సిన్ను చల్లడం ప్రారంభించి, 1971 మధ్య కాలానికి, నాల్గింట ఒక వంతు భూభాగంలో 61 శాతం విషపూరిత రసాయనాలు, 366 కిలోల డయాక్సిన్‌తో ఉన్న సుమారు ఎనిమిది కోట్ల లీటర్ల ఏజెంట్ ఆరంజ్ ను చల్లింది. దక్షిణ వియత్నాం పర్యావరణ వ్యవస్థను నాశనం చేసి, 48 లక్షల మంది వియత్నామీయులు ఏజెంట్ ఆరెంజ్ బారిన పడేలా చేసింది. ఆ దుష్ఫలితాలు రెండవ, మూడవ తరాలవారితో సహా సుమారు 30 లక్షల మంది ఇప్పటికీ బాధపడుతున్నారు.

1974: ఈనాడు తెలుగు దిన పత్రిక విశాఖపట్నంనుంచి ప్రారంభమైంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ జూలై=డిసెంబరు 2010 సర్వే ప్రకారం 16, 70, 750 కాపీలు పంపిణీ జరుగుతున్నది.

1988: నార్త్ సీ మరియు, బాల్టిక్ సముద్రం లలో ఉన్న సీల్ జంతువులకు, విచిత్రమైన జబ్బు సోకి, 6000 సీల్ జంతువులు మరణించాయి. ఆ జబ్బు, బ్రిటిష్ జలాలలో ఉన్న సీల్ జంతువులకు కూడా సోకింది.

1988: ఐక్య రాజ్య సమితి, ఆసియా ఖండం యొక్క జనాభా 3 బిలియన్లు (300 కోట్లు) అని ప్రకటించింది. భారతదేశపు జనాభా, ఈ క్షణంలో కావాలి అంటే ఇక్కడ నొక్కండి.

1990: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్ర గ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్ర గ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.

2000: ప్రపంచ జనాభా పెరుగుదలను, ప్రతిక్షణం, గమనించే, ఇబిబ్లియో అనే వెబ్‌సైటు, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరుకుందని ప్రకటించింది. ప్రపంచ జనాభా గడియారం. ప్రపంచ జనాభా ఎంతో తెలుసుకోవాలి అంటే ఇక్కడ నొక్కండి.

2003: ఎన్నడూ లేని ఎండ వేడికి (100 డిగ్రీల పారెన్‌హీట్ కి పైనే) బ్రిటన్ వాసులు మల మల మాడిపోయారు. దేశంలోని, సముద్రపు ఒడ్డులు, జనసముద్రమే అయ్యాయి. రహదారులు అన్నీ, ట్రాఫిక్ మూలంగా, అదుపు తప్పాయి.

2009: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.

జననాలు

1782: ఛార్లెస్ జేమ్స్ నేపియర్, బ్రిటిష్ సైనిక దళాధిపతి (ఆర్మీ జనరల్)

1874: హెర్బర్ట్ హూవర్ అమెరికా 31వ అధ్యక్షుడు (మ.1964) .

1894: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (మ.1980)

1914: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత (మ.1977)

1918: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985)

1929: పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు మరియు కేంద్ర మాజీమంత్రి. (మ.2017)

1932: పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు (మ.2010)

1933: తుర్లపాటి కుటుంబరావు, ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు వక్త.

1946: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక మరియు చలన చిత్ర నటుడు. (మ.2015)

1962: నందమూరి లక్ష్మీపార్వతి, రచయిత్రి, హరికథా కళాకారిణి, నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు.

2005: "ప్రణమ్య మెనారియ" 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి "దేవేంద్ర హర్నె" జననం 1995 జనవరి 9.

మరణాలు

1945: రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882)

1988: అరియాస్ అర్నుల్ఫో, పనామా దేశ అధ్యక్షుడు ( మూడు సార్లు) .

*🔻జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔻

🔻ఇంటర్నేషనల్ బయోడీజిల్ డే , (ప్రపంచ శాకాహార నూనె దినం)గా పాటిస్తున్నారు.

నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం

🔻ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 10, ఆగస్టు 10 తేదీల్లో ‘జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం’ చేపడుతోంది.

🔻డెంగ్యూ వ్యాధి నిర్మూలనా దినం.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...