Skip to main content

చరిత్రలో ఈ రోజు / ఆగస్టు 1

చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 1

సంఘటనలు

*🍎1498: క్రిస్టోఫర్ కొలంబస్ ఉత్తర అమెరికా ప్రధాన భూభాగం చేరాడు.*

*🍎1790: అమెరికాలో మొట్టమొదటి జనాభా లెక్కలు ముగిసిన రోజు. ఆనాటి అమెరికా జనాభా 39, 29, 214 మాత్రమే.*

*🍎1774: జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు ఆక్సిజన్(ఆమ్లజని ) మూలకాన్ని కనుగొన్నారు.*

*🍎1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు. భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1958 అక్టోబరు 1న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1957 ఏప్రిల్ 1 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు *

*🍎1798: ఆంగ్ల నౌకాదళం, నెల్సన్ నాయకత్వంలో, కింద, నైలు నది దగ్గర జరిగిన యుద్ధంలో ఫ్రాన్స్నావికాదళాన్ని ఓడించింది.*

*🍎1861: "టైమ్స్ వార్తాపత్రిక మొట్టమొదటి "వాతావరణ వివరాలు" ప్రచురించింది. ఆనాడు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న "అడ్మిరల్ రాబర్ట్ ఫిట్ఝ్‌రోయ్" ఈ వాతావరణ వివరాలు అందచేసాడు. ("రేపటి వాతావరణం వివరాలు" పుట్టిన రోజు)*

*🍎1876: కొలరాడో 38వ రాష్ట్రంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చేరింది.*
*🍎1914: జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగాచెప్పింది.*

*🍎1936: అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు.*

*🍎1955 : భారతీయ రైల్వేలో, ఆగ్నేయ రైల్వేఏర్పడింది.*

*🍎1957: భీమసేన్ సచార్, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగాపదవీస్వీకారం (1957 ఆగష్టు 1 నుంచి 1962 సెప్టెంబరు 6 వరకు) .*

*🍎1969: ఎయిర్ ఛీఫ్ మార్షల్గా అర్జున్ సింగ్ పదవి స్వీకారం (1964 ఆగష్టు 1)*

*🍎1946: అమెరికన్ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం,* *మరొకటి పుల్‌బ్రైట్*
*స్కాలర్‌షిప్ చట్టం.నుంచి1969 జూలై 15 వరకు)*

*🍎1971: అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే.*

*🍎1975: మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందంఅని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది)*

*🍎1981 : ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్".*

*🍎1983: జనరల్ ఎ.ఎస్.వైద్య భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.*

*🍎2008: భారత్కు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.*

జననాలు

*🍎10 బి.సి: క్లాడియస్ రోమన్ చక్రవర్తి (మ. 0054) .*

*🍎1744: జీన్ బాప్టిస్ట్ లామార్క్, నేచురలిస్ట్. (మ.1829)*

*🍎1770: విలియం క్లార్క్, ఎక్స్‌ప్లోరర్*

*🍎1779: ఫ్రాన్సిస్ స్కాట్ కీ, అమెరికన్ జాతీయగీతం రచయిత. పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాకనిర్మాత జననం 2 ఆగష్టు 1876. ఆశ్చర్యం ఏమిటంటే అమెరికా జాతీయ గీతాన్ని (ద స్టార్ స్ఫాంగ్‌ల్ద్ బేనర్ - “O say can you see by the dawn's early light” ) రచించిన ప్రాన్సిస్ స్కాట్ కీ పుట్టిన రోజు 1 ఆగష్టు 1779. ఇద్దరికి 1 రోజు తేడా. నెల ఒక్కటే. సంవత్సరాలు 97 తేడా. అమెరికా, భారత దేశము రెండూ ప్రజాస్వామ్య దేశాలే. ఒకరు జాతీయ పతాక నిర్మాత. మరొకరు జాతీయ గీతం రచయిత.*

*🍎1818: మేరియా మిచెల్, రోదసీ పరిశోధకుడు.*

*🍎1877: షార్లెట్ మారియన్ హుఘ్స్, బ్రిటన్ లోని క్లీవ్ లాండ్ (మార్స్క్) అనే చోట 1 ఆగష్టు 1877 న జన్మించి 1989లో బ్రిటన్ లోని పురాతన వ్యక్తిగా తన 112వ పుట్టిన రోజు చేసుకున్నది. ఈమె పుట్టిన రోజున అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన మొదటి టెలిఫోన్ కంపెనీ స్థాపించాడు. అదే సంవత్సరం మొదటి లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్, వింబుల్డన్ వద్ద జరిగింది. అప్పటికి క్వీన్ విక్టోరియా భారతదేశపు మహారాణిగా ఉంది.*

*🍎1882 : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్యసమరయోధుడు పురుషోత్తమ దాస్ టాండన్ జననం (మ.1962).*

*🍎1888: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. (మ.1964)*

*🍎1889: డాక్టర్ జాన్ ఎఫ్ మహనీ, సవాయి వ్యాధికి పెన్సిలిన్తో చికిత్స చేయటం మొదలుపెట్టి, అభివృద్ధి, చేసాడు. (ఆ కాలపు సుఖవ్యాధులలో సవాయిఅత్యంత భయంకరమైనది) (మ.1957)*

*🍎1890: అనంతపంతుల రామలింగస్వామి, ప్రముఖ తెలుగు కవి. (మ.1977)*

*🍎1900: పూడిపెద్ద కాశీవిశ్వనాథ శాస్త్రి, ప్రముఖ రచయిత, సాహితీకారుడు (మ.1962)*

*🍎1921: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (మ.1966)*

*🍎1925: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాదు‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (మ.2013)*

*🍎1932 : ప్రముఖ హిందీ సినిమా నటి మీనాకుమారి జననం (మ.1972).*

*🍎1933: డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు.*

*🍎1935: ఏ.బి.కె. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు.*

*🍎1936: వైవెస్ సెయింట్ లారెన్ట్, ఫాషన్ డిజైనర్.*

*🍎1942: జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు.*

*🍎1944: యూరి వి రొమనెన్కొ, రష్యాదేశపువ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు)*

*🍎1949: గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.*

*🍎1949: దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, ప్రముఖవిమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు.*

*🍎1955: అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.*

*🍎1956: అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు*

మరణాలు

*🍎1920: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856)*

*🍎1936: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863)*

*🍎2010: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (జ.1917)*

*🍎2013: పి.వి.రంగారావు, మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)*

జాతీయ దినాలు

*🍎తల్లిపాల వారోత్సవాలు తెలంగాణ / ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)*

*🍎1935 - ఆగస్టులోని మొదటి ఆదివారం 'స్నేహితుల దినోత్సవం" జరుపుకోవటం అమెరికాలో మొదలై ప్రపంచమంతా వ్యాపించింది.*
*🍎1976: ట్రినిడాడ్ స్వాతంత్ర్య దినోత్సవం.*
*🍎1976: టొబాగో స్వాతంత్ర్య దినోత్సవం.*

*🍎స్విట్జర్లాండ్ జాతీయ దినోత్సవం. (స్విస్ కాన్ఫెడరేషన్ దినోత్సవం)*

*🍎బెనిన్ జాతీయ దినోత్సవం.*

*🍎కుక్ ఐలాండ్స్ రాజ్యాంగ దినోత్సవం.*

*🍎జమైకా స్వాతంత్ర్య దినోత్సవం.*

*🍎ఇండియా ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవము.*

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...