Skip to main content

Current Affiars

కరెంటు ఎఫైర్స్

1. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
1) ప్రొఫెసర్ ఉదయభాస్కర్
2) ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
3) కె. అరుణ్ మోజి
4) ఎమ్.కె.షాకిర్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: గుజరాత్‌లో జరిగిన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సమావేశంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.

2. లారస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ - 2017 పురస్కారానికి ఎంపికైంది ఎవరు ?
1) రొనాల్డో
2) రోజర్ ఫెదరర్
3) ఉసెన్ బోల్ట్
4) టైగర్ వుడ్స్
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఉసెన్ బోల్ట్ గతంలో మూడు సార్లు (2003, 2010, 2013) లారస్ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల విభాగంలో సైమన్ బిలెన్ ఈ పురస్కారానికి ఎంపికైంది. లారస్ పురస్కారాన్ని క్రీడల ఆస్కార్ అవార్డుగా పిలుస్తారు.

3. దేశ్ భగత్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న క్రీడాకారుడు ఎవరు ?
1) సందీప్ సింగ్
2) రాహుల్ ద్రవిడ్
3) బైచూంగ్ భూటియా
4) మేరీ కోమ్
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: పంజాబ్‌కు చెందిన దేశ్ భగత్ విశ్వవిద్యాలయం (ప్రైవేటు) ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన తొలి హాకీ క్రీడాకారుడు దిలీప్ టర్కీ.

4. ప్రజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డ్ - 2017కు ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరు ?
1) విజయ్ చందర్‌రావు
2) సురేంద్ర మూర్తి
3) పాండు రంగారావు
4) నరేష్ చంద్ర
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: తెలంగాణలోని మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన పాండురంగారావు పంక్చర్ కాని ట్యూబ్‌లెస్ టైర్‌ను తయారు చేశారు. అలాగే సులభంగా విద్యుత్ స్తంభాలను ఎక్కేందుకు క్లచ్చర్స్‌ను తయారు చేశారు. ఇందుకు గాను రాష్ట్రపతి భవన్ ఆయనను ప్రజెంటేషన్ ఆఫ్ విజిటర్స్ అవార్డుకు ఎంపిక చేసింది.

5. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల ఏ ప్రాంతంలో దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖను ఏర్పాటు చేసింది ?
1) న్యూఢిల్లీ
2) సింగపూర్
3) కొలంబో
4) ఢాకా
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖలో సభ్య దేశాలుగా భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ఉంటాయి. ఈ దేశాల్లో ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధి కోసం ఈ శాఖ సహాయం చేస్తుంది.

6. ఆఫ్గనిస్తాన్ ఫ్యూచర్ (ఆఫ్గనిస్తాన్ భవిష్యత్తు) పేరుతో రష్యాలో జరగనున్న సమావేశానికి హాజరవుతున్న దేశం ఏది ?
1) శ్రీలంక
2) బంగ్లాదేశ్
3) కజకిస్తాన్
4) భారత్
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఈ సమావేశం రష్యా ప్రెసిడెంట్ వ్లాద్‌మిర్ పుతిన్ అధ్యక్షతన జరగనుంది. దీనికి భారత్‌తో పాటు చైనా, పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలు హాజరుకానున్నాయి.

7. కొబ్రా గోల్డ్ మిలటరీ విన్యాసాలు - 2017ను నిర్వహించిన దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) థాయ్‌లాండ్
3) కెనడా
4) చైనా
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: 36వ కోబ్రా గోల్డ్ మిలటరీ విన్యాసాలను థాయ్‌లాండ్, అమెరికా సంయుక్తంగా నిర్వహించాయి.

8. 2015-16 ఆర్థిక సంవత్సరంలో క్రొయేషియాతో భారత్ జరిపిన ద్వైపాక్షిక వర్తకం విలువ ఎంత ?
1) 148.44 మిలియన్ డాలర్లు
2) 159 మిలియన్ డాలర్లు
3) 168 మిలియన్ డాలర్లు
4) 180 మిలియన్ డాలర్లు
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: క్రొయేషియాతో ద్వైపాక్షిక వర్తకం అభివృద్ధి కోసం ఫిబ్రవరి 14న భారత్ నూతన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

9. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏరోస్పేస్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ ?
1) బోయింగ్
2) ఎయిర్ బస్
3) బోమ్ బార్ డైయిర్
4) లాక్‌హిడ్ మార్టిన్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: తెలంగాణ ప్రభుత్వం, జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థతో కలిసి ఎయిర్‌బస్ ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

10. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేనకు ముఖ్య అధికారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) ఆంటోనియా గుటై
2) నికోలస్ సర్కోజీ
3) జీన్ పీయరీ లాక్రోయిక్స్
4) లీ యువాన్ చాకో
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఐరాస శాంతి పరిరక్షణ సేనల ముఖ్య అధికారిగా హెర్వేలా లాడ్యౌస్ స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన జీన్ పీయరీ లాక్రోయిక్స్ నియమితులయ్యారు.

11. ఇటీవల ఏ రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించింది ?
1) మేఘాలయ
2) పశ్చిమ బెంగాల్
3) కేరళ
4) హర్యానా
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: పంజాబ్ ఎక్సైజ్ చట్టం 1914 ప్రకారం హర్యానాలో బహిరంగ ప్రదేశాలలో మద్యపానాన్ని నిషేధించారు.

12. ఇటీవల ఏ రాష్ట్రంలో కాలిమ్ పోంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు ?
1) మేఘాలయ
2) పశ్చిమ బెంగాల్
3) సిక్కిం
4) అరుణాచల్ ప్రదేశ్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాను విభజించి కాలిమ్ పొంగ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం రూ.220 కోట్లతో కాలిమ్ పోంగ్ నుంచి సిక్కింకు రహదారిని నిర్మించనున్నారు.

13. ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ (ఐపీసీ) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆన్‌లైన్ షాపింగ్‌లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది ?
1) చైనా
2) అమెరికా
3) జర్మనీ
4) కెనడా
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈ నివేదిక ప్రకారం చైనాలో వారానికి 36 శాతం మంది కనీసం ఒక్కసారైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారు. అమెరికా 16 శాతం, జర్మనీ 15 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

14. ఇస్రో ఇటీవల ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపింది ?  Current Affairs
1) PSLB - 27
2) PSLV - C27
3) PSLV - C37
4) PSLD - 27
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: పీఎస్‌ఎల్‌వీ సీ-37 ద్వారా ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇందులో మూడు ఉపగ్రహాలు భారత్‌వి కాగా 96 శాటిలైట్స్ అమెరికాకు చెందినవి. ఇజ్రాయెల్, నెదర్లాండ్, ఖజకిస్తాన్, స్విట్జర్లాండ్, యూఏఈలకు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి.

15. గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2017 ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) కొరియా
4) జపాన్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశాల జాబితాలో చైనా తర్వాత భారత్ ఉంది. ఈ నివేదిక ప్రకారం భారత్‌లో 2015లో వాయు కాలుష్యం వల్ల 1.1 మిలియన్ ప్రజలు చనిపోయారు. హెల్త్ ఎఫెక్ట్ ఇనిస్టిట్యూట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేటర్స్ అండ్ ఎవల్యూషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను తయారు చేశాయి.

16. భారతీయ పనోరమ చిత్రోత్సవాలను ఎక్కడ నిర్వహించారు ?
1) గోవా
2) హైదరాబాద్
3) పుణె
4) పోర్ట్ బ్లెయిర్
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: పోర్ట్ బ్లెయిర్‌లో ఫిబ్రవరి 15 నుంచి ఐదు రోజుల పాటు భారతీయ పనోరమ చిత్రోత్సవాలు జరిగాయి. అండమాన్ అండ్ నికోబార్ టూరిజం శాఖ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహించాయి.

17. పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
1) కేరళ
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) గోవా
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: పెరియార్ టైగర్ రిజర్వ్‌లోని శబరిమలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుని ఏర్పాటు చేయనున్నారు.

18. ఇండియన్ సీడ్ కాంగ్రెస్ - 2017 ఎక్కడ జరిగింది ?
1) పుణె
2) లక్నో
3) కాన్పూర్
4) కోల్‌కత్తా
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: సీడ్ ఆఫ్ జాయ్ అనే థీమ్‌తో కోల్‌కత్తాలో ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2017ను కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ నిర్వహించాయి.

19. ఆర్థిక స్వేచ్ఛ ఇండెక్స్ 2017లో భారత్ ర్యాంకు ఎంత ?
1) 63
2) 93
3) 143
4) 173
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: 186 దేశాలతో అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ఆర్థిక స్వేచ్ఛ ఇండెక్స్ - 2017ను తయారు చేసింది. ఈ నివేదికలో హాంకాంగ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

20. కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే కాయకల్ప పురస్కారానికి ఎంపికైన ఆసుపత్రి ఏది ?
1) ఎయిమ్స్ న్యూఢిల్లీ
2) ఎయిమ్స్ రాయ్‌పూర్
3) neigrihms, మేఘాలయ
4) pgimer, చంఢీగడ్
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆసుపత్రులలో వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితులు, పరిశుభ్రత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కాయకల్ప పురస్కారాలు ప్రదానం చేస్తుంది. ఈ అవార్డు అందుకున్న ఢిల్లీ ఎయిమ్స్ బహుమతిగా రూ.5 కోట్లు పొందింది.

21. యూకే ప్రభుత్వం అందించే శౌర్య పురస్కారానికి ఎంపికైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరు ?
1) రాజేంద్ర వర్మ
2) హమీద్ సయీద్
3) సునీల్ ముఖర్జీ
4) శాంద్ పనేసర్
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: భారత సంతతికి చెందిన స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ శాంద్ పనేసర్ మరియు క్రేగ్ ని కొల్సన్‌లు ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడినందుకు గాను యూకే శౌర్య పురస్కారానికి ఎంపికయ్యారు.

22. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) పన్నీర్ సెల్వం
2) ఈ కే పళనిస్వామి
3) శశికళ
4) దినకరన్
View Answer
స‌మాధానం: 2

23. అంతర్జాతీయ బాస్కెట్ బాల్ ఫెడరేషన్‌కు సాంకేతిక ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) సాత్విక్ ఘోష్
2) నార్మన్ ఇసాక్
3) మహమ్మద్ షరీఫ్
4) డేవిడ్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: చైనాలో నిర్వహించబోయే అంతర్జాతీయ బాస్కెట్ బాల్ ప్రపంచ కప్‌కు క్రీడాకారులను ఎంపిక చేసే బాధ్యతలను నార్మన్ ఇసాక్ నిర్వర్తించనున్నారు.

24. యూఏఈ ఏ సంవత్సరంలో లోపు అంగారక గ్రహంపై నివాసాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ?
1) 2117
2) 2090
3) 2050
4) 2100
View Answer
స‌మాధానం: 1

25. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రైలుని ఎక్కడ ప్రారంభించారు ?
1) ముంబయి
2) హైదరాబాద్
3) న్యూఢిల్లీ
4) కోల్ కత్తా
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి సైన్స్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలుని ప్రారంభించారు. ఇది 7 నెలల పాటు దేశమొత్తం తిరిగి వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

26. ఫార్చూన్ ప్రపంచ అత్యంత ఆదారణ కలిగి కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ ఏది ?
1) ఆపిల్
2) ఆమెజాన్
3) స్టార్‌బక్స్
4) బెర్క్ షైర్ హాత్‌వే
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఆపిల్ తర్వాతి స్థానంలో అమెజాన్, స్టార్ బక్స్, బెర్క్ షైర్ హాత్‌వే సంస్థలు ఉన్నాయి.

27. ప్రతిష్టాత్మక వ్యాస్ సమ్మాన్ 2016 పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) హరికృష్ణ
2) సురేంద్ర వర్మ
3) నాయని వెంకటరావు
4) రాజేంద్ర పట్నాయక్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: సురేంద్ర వర్మ రాసిన "కాట్న శామి కా వ్రిక్షా పద్మా - పంఖురి కి ధర్ సే" నవలకు గాను వ్యాస్ సమ్మాన్ - 2016 పురస్కారం వరించింది. ఈ అవార్డు కింద రూ.3.50 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందిస్తారు. హిందీ సాహిత్యానికి గాను కె.కె బిర్లా ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తుంది.

28. జాతీయ MSME ఎక్స్‌లెన్స్ పురస్కారం - 2017కు ఎంపికైన బ్యాంకు ఏది ?
1) విజయ బ్యాంకు
2) సౌత్ ఇండియా బ్యాంకు
3) కెనరా బ్యాంకు
4) కార్పొరేషన్ బ్యాంకు
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోన్న కార్పొరేషన్ బ్యాంకు కేంద్ర కార్యాలయం మంగళూరులో ఉంది.

29. ప్రసూతి, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన కార్యక్రమంలో చేరిన దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) భారత్
3) నేపాల్
4) భూటాన్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: ప్రసూతి, నవజాత శిశువుల మరణాలు తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 2030 నాటికి ఈ తరహా మరణాల్లో నివారించగలిగే వాటిని పూర్తిగా అడ్డుకోవాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. కాగా ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు మరో 9 దేశాలు చేరాయి.

30. ఇటీవల ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రపంచంలో అత్యంత ధృడమైన గ్రాఫిన్‌ను ఏ పదార్థంతో తయారు చేశారు ?
1) బొగ్గు
2) ఇసుక
3) సోయాబిన్
4) రక్తం
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌కు చెందిన శాస్త్రవేత్తలు సోయాబిన్‌తో ఈ గ్రాఫిన్‌ను తయారు చేశారు.

31. దక్షిణాసియా దేశాల స్పీకర్‌ల సమావేశం ఎక్కడ జరిగింది ?
1) కొలంబో
2) పోర్ట్ బ్లెయిర్
3) ఇండోర్
4) ఖాట్మాండ్
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఫిబ్రవరి 18,19 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ దేశాల స్పీకర్లు హాజరయ్యారు.

32. ప్రతిష్టాత్మక బ్రాండ్ లారెట్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) లతా మంగేష్కర్
2) అమితాబ్ బచ్చన్
3) రజనీ కాంత్
4) కమల్‌హాసన్
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: లతా మంగేష్కర్ ఇప్పటి వరకూ 30 వేల పాటలు పాడారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఆమె బ్రాండ్ లారెట్ పురస్కారానికి ఎంపికయ్యారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఈ పురస్కారాన్ని 2012లో అందుకున్నారు.

33. కేవలం మిహ ళా సిబ్బంద మాత్రమే పనిచేసే ఐఎన్‌ఎస్‌వి తరిణిని ఎక్కడ జల ప్రవేశం చేయించారు ?
1) మంగుళూరు
2) పనాజీ
3) విశాఖపట్నం
4) కొచ్చిన్
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: సముద్ర ప్రయాణాల గస్తీ కోసం ఇటీవల రెండు బోట్‌లను నావికాదళంలో ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి ఐఎన్‌ఎస్‌వి తరిణి కాగా రెండోది ఐఎన్‌ఎస్‌వి మహదే. ఐఎన్‌స్‌వి తరిణిలో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు.

34. ఇటీవల ఐసీజీఎస్ ఆయుష్‌ను ఎక్కడ జల ప్రవేశం చేయించారు ?
1) ముంబయి
2) చెన్నై
3) విశాఖపట్నం
4) కొచ్చి
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఐసీజీఎస్ ఆయుష్‌ను కొచ్చి షిప్‌యార్డులో నిర్మించారు. ఇది భారత్ ప్రత్యేక ఆర్థిక సముద్ర జోన్ ప్రాంతంలో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పనిచేస్తూ, సముద్ర శోధన, రెస్క్యూ ఆపరేషన్‌లు నిర్వహిస్తుంది.

35. ఇటీవల ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన క్రయోజనిక్ ఇంజిన్ (సీ 25)ను ఏ వాహక నౌకలో ఉపయోగించనున్నారు ?
1) PSLV - 38
2) MSL - 40
3) GSLV MARK - III
4) SLV MARK - III
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఈ పరిజ్ఞానాన్ని ఇస్రో ఇటీవలే విజయవంతంగా పరీక్షించింది. క్రయోజనిక్ ఇంజిన్‌తో కూడిన GSLV MARK - III రాకెట్ ద్వారా4 టన్నుల బరువుగల ఉపగ్రహాలను జియో స్టేషనరీ ట్రాన్సఫర్ ఆర్బిట్‌లోకి పంపనున్నారు.

36. ఉమెన్స్ ఆసియాన్ రగ్బి సెవెన్ ట్రోఫీలో బంగారు పతకాన్ని గెలుచుకున్న జట్టు ఏది ?
1) భారత్
2) దక్షిణ కొరియా
3) లావోస్
4) వియత్నాం
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: వియత్నాం, లావోస్‌లలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ను ఓడించి దక్షిణ కొరియా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పైన్స్, మలేషియా, నేపాల్, లావోస్ దేశాలు పాల్గొన్నాయి.

37. కృత్రిమ వర్షాలు కురవడానికి వాడే రసాయనం ఏది ?
1) సోడియం బైకార్బొనేట్
2) సల్ఫర్ ఐయోడైడ్
3) సిల్వర్ ఐయోడైడ్
4) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: షోలాపూర్ ప్రాంతంలో కృత్రిమ వర్షాల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ సహకారంతోమహారాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు రూ.250 కోట్లు కేటాయించింది.

38. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నేపాల్‌కు 340 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) సింగపూర్
4) ఆస్ట్రేలియా
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: ఈ రుణంతో నేపాల్‌లో మహాలాకీ వంతెనతో పాటు 15 కొత్త రోడ్లను నిర్మిస్తారు.

39. శ్రీనగర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించిన తొలి విమానయాన సంస్థ ఏది ?
1) ఎమిరేట్స్
2) గరుడ ఇంటర్నేషనల్
3) సింగపూర్ ఎయిర్‌లైన్స్
4) ఎయిర్ ఏషియా
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: శ్రీనగర్‌లోని షేక్ ఉల్ ఆలమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఏషియా సంస్థ 2017 ఫిబ్రవరిలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించింది.

40. 67వ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఆర్ట్స్ సినిమా పురస్కారానికి ఎంపికైన చిత్రం ఏది ?
1) బాహుబలి
2) న్యూటన్
3) ఎడిసన్
4) రాయిస్
View Answer
స‌మాధానం: 2

వివ‌ర‌ణ‌: 2017 ఫిబ్రవరి 9 నుంచి 18 వరకూ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవం జరిగింది. ఇందులో అమిత్ మాసుర్కర్ తీసిన న్యూటన్ అనే పొలిటికల్ డ్రామా చిత్రానికి ఆర్ట్స్ సినిమా పురస్కారం లభించింది.

41. బారెన్ అగ్నిప్రభుత్వం ఎక్కడ ఉంది ?
1) సుందర్ బన్స్
2) లక్ష్యదీప్
3) అండమాన్ అండ్ నికోబార్
4) పాక్ జలసంధి
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: దక్షిణాసియాలో క్రీయాశీలకంగా ఉన్న ఏకైక అగ్ని పర్వతం బారెన్. ఇది చివరగా 1911లో లావా విరజిమ్మింది. 2017 జనవరి నుంచి దీని నుంచి మళ్లీ లావా విడుదలవుతోందని సీఎస్‌ఐఆర్, గోవాకు చెందిన నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సంస్థలు ప్రకటించాయి.

42. జాతీయ రేస్‌వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని ఎవరు సాధించారు ?
1) సందీప్ కుమార్
2) జితేందర్ సింగ్
3) చందన్ సింగ్
4) రాజేంద్ర సింగ్
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీలో సందీప్ కుమార్ 3 గంటల 55 నిమిషాల 59 సెకండ్లలో 50 కిలోమీటర్లు నడిచాడు. తద్వారా నూతన రికార్డు నెలకొల్పి లండన్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఈ పోటీ ల్లో రెండో స్థానంలో జితేందర్ సింగ్, మూడవ స్థానంలో చందన్ సింగ్ నిలిచారు.

43. ప్రఖ్యాత కార్టూన్ రాబిట్ మిఫ్పీ రూపకర్త ఎవరు ?
1) క్లార్ బార్క్
2) జామ్ డేవిస్
3) మైక్ జోడి
4) డిక్ బ్రూనా
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: డిక్ బ్రూనా 2 వేలకు పైగా పిల్లల పుస్తకాలను రచించారు. ఆయన పుస్తకాలు 80 మిలియన్ల వరకూ అమ్ముడయ్యాయి. డిక్ బ్రూనా 2017 ఫిబ్రవరి 16న మరణించారు.

44. " హేమా మాలిని : బియాండ్ ది డ్రీమ్ గర్ ్ల" పుస్తక రచయిత ఎవరు ?
1) రాజేంద్ర ముఖర్జీ
2) రామ్ కమల్ ముఖర్జీ
3) రామ్ వర్దన్ శర్మ
4) శ్యామ్‌జీ
View Answer
స‌మాధానం: 2

45. స్టాక్ హోమ్ అంతర్జాతీయ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది ?
1) చైనా
2) చిలీ
3) భారత్
4) దక్షిణ కొరియా
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: ఈ సంస్థ నివేదిక ప్రకారం 2012-16 మధ్య భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అమెరికా అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తుండగా రష్యా, చైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

46. గ్లోబల్ గ్రీన్ భవిష్యత్తు లీడర్ షిప్ పురస్కారాలలో ఉత్తమ గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డుకు ఎంపికైన ఐరన్ మైన్ (ఇనుము గని) ఏది?
1) కాటామతి ఐరన్ మైన్
2) బయ్యారం ఐరన్ మైన్
3) రత్నగిరి ఐరన్ మైన్
4) బళ్లారి ఐరన్ మైన్
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: కాటామతి ఐరన్ మైన్ జార్ఖండ్‌లో ఉంది. దీన్ని టాటా స్టీల్స్ సంస్థ నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ చర్యలు చేపట్టినందుకు గాను ఈ ఐరన్ మైన్‌కు గ్రీన్ ఆర్గనైజేషన్ అవార్డు లభించింది.

47. అంతర్జాతీయ స్పోర్ట్స్ కంపెనీ పూమాతో రూ.100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారత క్రికెటర్ ఎవరు ?
1) మహేంద్రసింగ్ ధోని
2) విరాట్ కోహ్లీ
3) ఛతేశ్వర పుజారా
4) రవీంద్ర జడేజా
View Answer
స‌మాధానం: 2
వివ‌ర‌ణ‌: విరాట్ కోహ్లీ పూమాతో 8 సంవత్సరాల కాలానికి రూ. 100 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.

48. ప్రతిష్టాత్మక రోటర్ డ్యామ్ ఓపెన్ టైటిల్ విజేత ఎవరు ?
1) గేల్ మొన్ఫిల్స్
2) స్టాన్ వావ్రింకా
3) జో విల్‌ఫైడ్ సోంగా
4) డేవిడ్ గోఫిన్
View Answer
స‌మాధానం: 3
వివ‌ర‌ణ‌: రోటర్ డ్యామ్ ఓపెన్‌ను ఎబిన్ ఆమ్రో ప్రపంచ టెన్నిస్ టోర్నమెంట్ అని కూడా అంటారు. ఈ టోర్నీ ఫైనల్లో డేవిడ్ గోఫిన్‌ను ఓడించి జో విల్‌ఫైడ్ సోంగా టైటిల్ సొంతం చేసుకున్నాడు.

49. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 10
2) ఫిబ్రవరి 14
3) ఫిబ్రవరి 16
4) ఫిబ్రవరి 20
View Answer
స‌మాధానం: 4
వివ‌ర‌ణ‌: ఏటా ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని 2007లో ఐరాస సాధారణ సభ తీర్మానం చేసింది. ఇది 2009 నుంచి అమల్లోకి వచ్చింది.

50. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) ఫిబ్రవరి 21
2) ఫిబ్రవరి 20
3) ఫిబ్రవరి 19
4) ఫిబ్రవరి 18
View Answer
స‌మాధానం: 1
వివ‌ర‌ణ‌: భాషల్లో భిన్నత్వం, బహు భాషల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 1999 నుంచి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
        

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...