Skip to main content

Current Affairs

Current Affairs

జాతీయం

1.రైలు ప్రమాదాల నివారణకు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ సంస్థ పేరేంటి ?
జ: రైలు భద్రత ప్రాధికార సంస్థ ( Railway Safety Authority-RSA)
(నోట్: ఈ సంస్థకు రూ.1.9లక్షల కోట్ల నిధిని సమకూర్చాలని కేంద్ర భావిస్తోంది )

2.నౌకాశ్రయాల ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సామాజిక వర్గాల అభివృద్ధి, ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకం పేరేంటి ?
జ: సాగరమాల
(నోట్: ఈ పథకం కింద 400 ప్రాజెక్టులను గుర్తించారు. )

3.సైన్యం చేతికి అత్యాధునిక రాడార్లు సప్లయ్ చేస్తున్నారు. ఇంటి పైకప్పుల్లో నక్కిన ఉగ్రవాదులను కూడా కనిపెట్టే సామర్థ్యం ఉన్న ఈ రాడార్ పేరేంటి ?
జ: త్రూ ద వాల్

4.కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ SDRF-2017 రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు ఎక్కడ జరుగుతుంది?
జ: ఢిల్లీ

5.ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: బోపన్న
(నోట్: కెనడా ప్లేయర్ గాబ్రియెలా డబ్రోస్కీతో కలసి గెలిచారు)

6.2017 ఫాల్కే బ్రేవ్ అండ్ బ్యూటీఫుల్ అవార్డు గెలుచుకున్న నటి ఎవరు ?
జ: మనీషా కోయిరాలా

7.ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కి ఇండిపెండెంట్ డైరక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: KG కర్మాకర్, గౌరీ శంకర్

8.అన్షి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక

9.నేషనల్ హెల్త్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ ఆన్ యోగా – 2017 ఏ నగరంలో జరుగుతోంది ?
జ: న్యూఢిల్లీ ( జూన్ 9, 2017)

10.జంతువుల హింసను నిరోధించేందుకు ఉద్దేశించిన కంబాలా బిల్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది ?
జ: కర్ణాటక ( Prevention of Cruelty to Animals (Karnataka Amendment) Bill)

11.కొత్త పుట్టిన పిల్లలకు తల్లి పాలను అందించేందుకు నేషనల్ హూమన్ మిల్క్ బ్యాంకును ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో ప్రారంభించారు. ఈ బ్యాంకును ఏమని పిలుస్తారు ?
జ: వాత్సల్య మాత్రి అమృత్ కోష్

12.తక్కువ రేటులో విమాన ప్రయాణం కోసం ఉద్దేశించిన ఉడాన్ పథకంలో చేరేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖతో ఒప్పందం చేసుకుంది ?
జ: తమిళనాడు

13.లండన్ కు చెందిన ఓపెన్ సిగ్నల్ సంస్థ వెల్లడించిన ఇంటర్నెట్ డేటా స్పీడ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కి ఎంత ర్యాంక్ వచ్చింది ?
జ: 74 వ ర్యాంకు ( Average 4G download speed in India is 5.1Mbps)
(నోట్: పాకిస్థాన్, శ్రీలంక కన్నా వెనుకబడి ఉంది.

అంతర్జాతీయం

1.షాంఘై సహకార సంఘం (SCO) శిఖరాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్తాన్ రాజధాని అస్తానాకు వెళ్ళారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం అయ్యారు. ఆయన పేరు ఏంటి ?
జ: కజకిస్థాన్ అధ్యక్షుడు

2. నూర్సుల్తాన్ నజర్ బాయెవ్
షాంఘై సహకార సంస్థ (SCO)లో ఏ రెండు దేశాలకు పూర్తిస్థాయి సభ్యత్వం లభించనుంది ?
జ: భారత్, పాకిస్థాన్

3.బ్రిటన్ లో ప్రస్తుత ప్రధాని థెరిసా మే ఉన్న పార్టీకే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీ పేరేంటి ?
జ: కన్సర్వేటివ్ పార్టీ

4.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుకూలమైన మూడు దేశాలుగా వేటిని ఐక్యరాజ్య సమితి వాణిజ్యాభివృద్ధి సదస్సు ( UNCTAD) గుర్తించింది ?
జ: అమెరికా, చైనా, భారత్

5.ఆసియాలో వినియోగదారులకు అనుకూల మార్కెట్లు ఉన్న ఏ ఐదు దేశాలను BMI రీసెర్చ్ 2017 గుర్తించింది ?
జ: చైనా, శ్రీలంక, వియత్నాం, ఇండియా, ఇండోనేషియా

6.వాల్డ్ ఓషియన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: జూన్ 8

7.అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వ్యోమగామిగా ఎంపికైన భారత అమెరికన్ ఎవరు ?
జ: రాజాచారి
(నోట్: ప్రస్తుతం ఈయన అమెరికా ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్నారు )

8.నేపాల్ లో 1200 మెగావాట్ల బుధి గండకీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏ దేశం సాయం చేయనుంది ?
జ: చైనా

9.2017 జూన్ 7 నుంచి 8 వరకూ బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు ఏ నగరంలో జరిగాయి ?
జ: బీజింగ్ (చైనా)
(నోట్: ఇందులో భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాకి చెందిన 25 మీడియా సంస్థలు పాల్గొన్నాయి. 10 లక్షల రూపాయలు (One Million Dollar Fund) తో దీన్ని ఏర్పాటు చేశారు)

10.WHO యాంటిబయోటిక్స్ ను మూడు విధాలుగా విభజించింది. వాటిని ఏమంటారు ?
జ: Access, Watch and Reserve

11. 2018 క్వాక్వారెల్లీ సిమండ్స్ ( Quacquarelli Symonds) ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్ లో భారత్ నుంచి మొదటగా నిలిచిన విద్యా సంస్థ ఏది ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ
(నోట్: గతంలో IIT బెంగళూరు ఉండేది. ఇందులో మొదటి స్థానం అమెరికాకి చెందిన మాసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) కి దక్కింది.)

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...