Skip to main content

గురు పౌర్ణిమ !!

ప్ర‌పంచానికే పున్న‌మి - గురుపౌర్ణ‌మి

హైంద‌వుల గాయ‌త్రి మంత్రం `ధియోయోనః ప్ర‌చోద‌యాత్` అని వేడుకుంటుంది. అంటే మా బుద్ధిని విక‌సింప‌చేయి అని అర్థం. జీవితంలోని ప్ర‌తి సంద‌ర్భంలోనూ, ప్ర‌తి ప్ర‌స్థానంలోనూ... ఏది మంచి, ఏది చెడు! ఏది ఉచితం, ఏది అనుచితం! అన్న నిర్ణ‌యం తీసుకోవ‌ల‌సి ఉంటుంది. మ‌నిషి తీసుకునే ఆయా నిర్ణ‌యాలు అత‌ని వ్య‌క్తిత్వాన్ని సూచిస్తాయి. కానీ స‌రైన న‌డ‌వ‌డిలో ఉండాల్సిన అటువంటి *సంస్కారం అల‌వ‌డాలంటే గురువు సాయం త‌ప్ప‌నిస‌రి.* అది విద్య‌ని నేర్పిన గురువులు కావ‌చ్చు. విద్య ప‌ర‌మార్థాన్ని బోధించే త‌త్వ‌వేత్త‌లు కావ‌చ్చు. నేర్చుకోవాల‌న్న త‌ప‌న ఉంటే, *ఈ సృష్టిలోని చరాచ‌రాల‌న్నీ మ‌న‌కి గురువుగా నిలుస్తాయి.* అందుక‌నే *ద‌త్తాత్రేయుడు ఆకాశం నుంచి స‌ముద్రం దాకా త‌న‌కి 24 మంది గురువులు ఉన్నార‌ని చెప్పారు.* గురువును మ‌నం సాక్షాత్తూ ప‌ర‌బ్ర‌హ్మ‌గా భావించి పూజిస్తాము. ఆ దేవుని సైతం ప‌రిచ‌యం చేసేది గురువే కాబ‌ట్టి *క‌బీరు, దేవుని కంటే ముందుగా త‌న గురువుకే న‌మ‌స్క‌రిస్తాన‌ని చెబుతాడు.*
విశిష్ట వ్య‌క్తిత్వం ఉన్న గురువుని త‌ల‌చుకునేందుకు ఒక విశిష్ట‌మైన రోజు కూడా ఉండాలి క‌దా... *అదే గురుపౌర్ణ‌మి!* వేద‌వ్యాసునిగా పిలువ‌బ‌డే *కృష్ణద్వైపాయుని పుట్టిన‌రోజే ఈ గురుపౌర్ణ‌మి.* హైంద‌వుల‌కి ఎంతో పూజ‌నీయ‌మైన‌ భారతం, భాగవతాల‌తో పాటు అష్టాదశపురాణాలు రచించిన‌వాడు వ్యాసుడు. అంతేకాదు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న వేద‌విజ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభ‌జించినవాడు. అందుకే ఆయ‌న‌కు వేద‌వ్యాసుడు అన్న పేరు వ‌చ్చింది. *గురువుని ఆరాధించ‌డానికి ఇంత‌కంటే గొప్ప రోజు మ‌రేముంటుంది?*
జీవితంలో అంద‌రూ అన్నీ తెలుసుకోలేరు. అనుభ‌వంతోనూ, ఆలోచ‌న‌తోనూ, అభ్యాసంతోనూ కొంద‌రు మ‌న‌కంటే జ్ఞాన‌వంతులై ఉంటారు. అలాంటి జ్ఞాన‌సంప‌న్నులే గురువులు. *"అంతా నీలోనే ఉంది. నువ్వ‌వ‌రో ముందు తెలుసుకో! "* అని చెప్ప‌డానికి కూడా ఒక గురువు కావాలి క‌దా! బ్ర‌తుక‌నే ప్ర‌యాణంలో ప్ర‌తి మ‌జిలీ గురించీ క్షుణ్నంగా తెలిసిన‌వాడే గురువు. అందుకే అన్నీ తెలిసిన దేవ‌త‌లైనా, అజ్ఞానానికి మారుపేరైన అసురులైనా గురువుని ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌లేదు. శిష్యుని వ్య‌క్తిత్వంలో సంస్కారం, గురువు బోధ‌లో సాధికార‌త ఉంటే *ప్ర‌తి గురుశిష్య బంధ‌మూ లోకానికి ఓ కొత్త ఒర‌వ‌డిని ఇస్తుంది.* అల‌నాటి రాముని తీర్చిదిద్దిన వ‌శిష్ఠుల నుంచీ, *వివేకానందుని కార్యోన్ముఖుడిని చేసిన రామ‌కృష్ణుల వ‌ర‌కూ ప్ర‌తి గురువూ పూజ‌నీయులే!* ఆది నుంచీ గురుపౌర్ణ‌మిని ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ... *శ్రీపాద‌, శ్రీనృసింహ‌, అక్క‌ల్‌కోట‌, స్వామిస‌మ‌ర్థ‌, షిరిడీసాయిబాబా... త‌దిత‌ర అవ‌ధూత‌లు ద‌త్తాత్రేయుని అవ‌తారాలు*గా పూజ‌లు అందుకోవ‌డంతో గురుపౌర్ణ‌మి నానాటికీ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటోంది.
*గురువు అంటే మ‌న చెంత‌నే ఉండేవారు కాన‌వ‌స‌రం లేదు.* మ‌న విధిని, సంస్కారాన్ని అనుస‌రించి నియ‌త గురువులు, అనియ‌త గురువులు అని రెండు ర‌కాలైన గురువులు మ‌న‌కి జ్ఞానాన్ని ప్ర‌సాదిస్తార‌ట‌. నియ‌త గురువులు అంటే మ‌న‌ల్ని ఉద్ధ‌రించేందుకు నియ‌మింప‌బ‌డిన‌వారు, అనియ‌త గురువులు అంటే స‌మ‌యానుకూలంగా మ‌న జీవితంలోకి ప్ర‌వేశించి, మ‌న‌కి మంచిదారిని చూపేవారు. ఆ ర‌కంగా *జీవితంలో మంచి మార్గాన్ని సూచించే ప్ర‌తిఒక్క‌రూ అనియ‌త గురువులే!* మాన‌వుడు ఉన్నంత‌వ‌ర‌కూ జ్ఞానం అవ‌శ్య‌క‌త ఉంటుంది. *ప్ర‌పంచం ఉన్నంత‌వ‌ర‌కూ గురువు అవ‌స‌ర‌మూ ఉంటుంది.*
అందుక‌నే మ‌న పురాణాలు వేద‌వ్యాసునికి మ‌ర‌ణం లేదు అని చెబుతున్నాయి. నిజ‌మే క‌దా!                                      

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...