Skip to main content

Noble Persons in History - Helen Adams Keller


అంధ మరియు బధిర అమెరికన్ రచయిత్రి, ఉద్యమకర్త.."హెలెన్ ఆడమ్స్ కెల్లర్" 



"అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారధిగా ప్రపంచ స్థాయిలో పేరొందిన "హెలెన్ ఆదాం కెల్లర్" ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు"

■ జార్జి బెర్నార్డ్ షా, థామస్ అల్వాఎడిసన్, ఐన్‌స్టీన్,రవీంద్రనాథ్ ఠాగూర్,చార్లీ చాంప్లిన్, మొదలైన ప్రముఖులు మీద తన పరిచయ ప్రభావాన్ని ప్రస్ఫుటంగా కలిగించిన ఈమె మహోదాత్త వ్యక్తిగా నిలిచారు.

■ ఊహ బాగా అందే అందక పూర్వమే పెద్ద జబ్బు చేసి, చూపు,వినికిడి,మాట పోగొట్టుకొని పూర్తి వికలాంగురాలై ఈమె ఈ ప్రపంచాన్ని చూసింది లేదు. ఏ శబ్దాన్ని విన్నదీ లేదు. అయినా అన్నీ అవయవాలు సలక్షనంగా ఉన్న వారందరి కంటే మహోన్నత స్థాయిలో జీవించారు.

■ పట్టుదలతో సాధింపలేనిది ఏదీ లేదని తన జీవితం ద్వారా నిరూపించి ప్రపంచ పౌరులందరికీ ఆదర్శవంతమైన సార్థక సేవా విదుషీమణీగా వన్నెకెక్కారు.

■ "19 వ శతాబ్దం" లో అత్యంత శక్తిమంతులుగా ఆవిర్భవించిన వారు ఇద్దరే ఇద్దరు. ఒకరు నెపోలియన్ అయితే రెండవవారు హెలెన్ కెల్లర్ అని ప్రసిద్ధ రచయిత మార్క్ ట్వయిన్ కితాబు నందుకున్న ఈమె వికలాంగుల కష్ట నిష్టూరాలు మీదనే కాక, మహిళల హక్కులను గూర్చి పుంఖానుపుంఖాలుగా పత్రికా రచనలు చేశారు. మహిళా హక్కుల సాధనకు స్వయంగా ఉద్యమాలు నడిపారు.

★ "ది స్టోరీ ఆఫ్ మై లైఫ్" గ్రంథ రచనతో తన పుస్తక రచనలకు శ్రీకారం చుట్టి అనేక ప్రఖ్యాత రచనలను వెలువరించారు.

■ వికలత్వానికి, అంధత్వానికీ మూలం పేదరికమనీ, అదిలేని సమాజ స్థాపన ద్వారా వికలాంగుల సమస్యల పరిష్కారం సాధ్యమనీ, అట్టిది సమ సమాజ స్థాపన ద్వారానే సాధ్యమనీ ధృఢంగా విశ్వసించి వికలాంగుల ఉజ్వల భవిష్యత్తుకు విశేష కృషి చేశారు.

బాల్యం ..
◆ అమెరికా లోని అలబామా రాష్ట్రంలోని టస్కాంబియా అనే బస్తీలో జన్మించింది. పుట్టుకతో అంగవికలురాలు కాదు.

◆ ఏడాదిన్నర గడిచిన తర్వాత పెద్ద జబ్బు చేసి, మెదడు తీవ్ర రుగ్మతకు గురై క్రమక్రమంగా చూపు , వినికిడి తర్వాత మాట్లాడేశక్తిని కోల్పోయారు. అయితే ఈమె లోన సాధారణతెలివితేటలకు, ఇతర అవయవాల ఆరోగ్యానికి ఏ మాత్రం లోపం రాలేదు.

◆  మూడేళ్ళ వయసులో ఒకరోజు తన"ఏప్రస్"నుతడుపుకొనిఆరబెట్టుకొనేందుకు గది వెచ్చదనం కోసం ఉంచిన పొయ్యి దగ్గరకు చేరుకోవడంతో ఆమె బట్టలు అంటుకొని కనుబొమ్మలు,జుట్టు,నుదురు కాలాయి. ఈ సంఘటనతో చలించిపోయిన తల్లిదండ్రులు మరింత దిగులుపడ్డారు.

◆ వెంటనే బాల్టమోర్ పట్టణంలోని ప్రఖ్యాత నేత్ర వైద్యునితో సంప్రదించగా "చూపు వచ్చే అవకాశం లేదు గానీ, మెదడులోని నరాలన్నీ చాలా చురుకుగా ఉన్నాయి. వాషింగ్టన్ అలగ్జాండర్ గ్రాంహంబెల్ వద్దకు తీసుకెళ్ళమని" సలహా అందింది.

విద్యాభ్యాసం..
◆ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్గ్రాహంబెల్ భార్యకు దారుణమైన చెముడు. ఆమెకుమాటలునేర్పేపట్తుదల, అవిరామ ప్రయత్నాల ఫలితమే టెలిఫోన్ ఆవిష్కరణ.

■ ఆయన సలహా మేరకు అంధులకు విద్య నేర్పే "పెర్కిన్స్ ఇనిస్టిట్యూట్" యాజమాన్యా న్ని (బోస్టన్) కెల్లర్ తండ్రిఅభ్యర్థించాడు.తన కూతురుకు విద్య నె ఒక్ర్పేఅ అధ్యాపకురాలిని ఒప్పించి తన ఇంటివద్దే విద్య నేర్పేందుకు పంపమన్నాడు.

◆ఈ ఇన్‌స్టిట్యూట్ వారే మూగ,గుడ్డి వ్యక్తి మాట్లాడటం, రాయడం నేర్చిన ప్రపంచంలో ప్రథమ వ్యక్తి లారా బ్రిడ్జియన్ ను తీర్చిదిద్దారు.

◆ కెల్లర్ విద్యాబుద్దులు నేర్పించడానికి అన్నే సలీవాన్ నియామకం జరిగింది.టీచర్ కు కనబడిన ప్రతి వస్తువు పేరు కెల్లర్ అరచేత రాయడం, ఈమె ప్రతీదీ తడిమి చూసి అవగాహన చేసుకుని గుర్తించడం, రాయడం, గుర్తు పెట్టుకోవడంతో నిరంతర విద్యార్జన కొనసాగింది.

బ్రెయిలీ లో విద్యార్జన..
★ వినికిడి శక్తి వున్న అంధులు సులభ రీతిలో రాసే పద్ధతి ఫ్రెంచ్ దేశస్థుడు,పుట్టు గ్రుడ్డి అయిన లూయీ బ్రెయిలీ కృషి ఫలితంగా ఏర్పడి, ప్రపంచ వ్యాప్తంగా అమలుకు వచ్చిన పద్ధతి "బ్రెయిలీ లిపి".

★  వినికిడి, మాట కూడా లేని కెల్లర్ కు ఈ పద్ధతి లో రాయటం, నేర్చడం అత్యంత కష్ట భరితమే కాకుండా, ఎంతో సహనం, మెళుకువ, నేర్పు కూడా అవసరం. అయినప్పటికీ సలీవాన్ కు సాధ్యమైంది. ప్రతి భావాన్ని అంశాన్నీ అరచేతిలో రాయడం,దానిని గ్రహించే "ఆకళింపు శక్తి" ని పెంచుకున్న కెల్లర్ పట్టుదలగా నేర్చుకోవడంతో అనతి కాలంలోణే బ్రెయిలీ లిపిలో అనాటికి ఉన్న పుస్తకాలన్నీ జీర్ణించుకున్నారు.

★ సీవాన్ అధ్యాపకురాలుగా చేరిన (1887) మూడేళ్లలోనె బ్రెయిలీ లిపిని ఆపోసన పట్టిన కెల్లర్ ద్విగుణీకృత ఉత్సాహంతో 1900 లో కాలేజి లో అడుగు పెట్టి బి.ఎ పట్టాను పుచ్చుకున్నారు.

★ కాలేజీ లో కూడా తన తరగతులన్నిటికీ తన టీచర్ ను వెంటబెట్టుకెళ్ళేవారు. అనితర సాధ్యాన్ని కూడ సుసాధ్యం చేసి విద్యాభ్యాసం ముగించారు.

మహా వక్తగా...
■ ప్రతి ఒక్క అంశం నేర్చుకోవాలన్న తపన ఈమెలో వయసు పెరుగుతున్న కొద్దీ పెరిగింది. తన శారీరక మానసిక శక్తులన్నిటినీ కేంద్రీకరైంచి, చేతి వేళ్ళ సాయంతో తన మనోభావాలను ఎదుటి వారికి అర్థం కాగల రీతిలో చెప్పడంతోనే తృప్తి చెందలేదు.

■ పట్తుదల సాధించి పెట్టిన విజయానికి సంతృప్తి పడని కెల్లర్ ఒకరోజు "నార్వేలో ఒక మూగ మహిళ మాట్లాడటం నేర్చుకోగలిగింది." అనే వార్త తెలిసిన కెల్లర్ తానూ మాట్లాడటం నేర్చుకోవాలని కఠోర శ్రమ చేశారు.

■  నార్వే మహిళ మూగదైనా, చూపు చక్కగా ఉన్నదనీ, ఇతరులు మాట్లాడేటప్పుడు పెదాల కదలికలను అనుకరించి నిత్య సాధనతో సాధించిందనీ, మరి చూపు లేనప్పుడు సాధ్యపడదని టీచర్ వారించినా, సమాధానపడలేదు.

■ మాట్లాడటం నేర్పే టీచర్ ను నియమించుకుని , ఆమె మాట్లాడుతుంటే ఆమె ముఖం, పెదాలు,నాలుక,గొంతు నాళాలు ఏ విధంగా కదులుతున్నాయో, తన వేళ్ళతో తడిమి తెలుసుకొని తానూ ఆ విధంగా అనుకరించి విపరీత శ్రమతో సాధన చేశారు.

■ ప్రారంభంలో కెల్లర్ మాటలు సలీవంకు, ఈ కొత్త టీచర్(పుల్లర్) కు మాత్రమే అర్థమయ్యేవి. మొత్తం మీద నిరంతర కఠోర పరిశ్రమతో రానురాను ఈమె స్పరపేటిక చలించి, స్వరంలో స్పష్టత చేకూరింది. మరి కొద్ది కాలానికి మహా వక్త కాగలిగింది.

విశేష మానసిక శక్తులు..
★ మనోబలం , దీక్షలనే ఆక్సిజన్ గా ఉపయోగించుకుంటూ, కాలక్రమేణా అందరి మాఅదిరి గానే చెస్ ఆడటం, గుర్రపు స్వారీ చేయటం,సైక్లింగ్ మొదలైన రంగాలలో చొరబడ్డారు. సంగీత కచేరీలు,సారస్వత గోష్టులతో పాల్గొనడమంటే మహా ఉత్సాహం చూపేవారు. బధిరత్వాన్ని జయించే అద్భుతమైన శక్తిని కూడా అందుకున్నారు.

★ ఈమె శరీరం శబ్ద తరంగాలలోనే సునిశిత తారతమ్యాన్ని, గాలిలో వచ్చే అతి సూక్ష్మ మార్పులను (తరంగ ధ్వనులు) కూడ గ్రహించగలిగినంత సుకుమారంగా, సునిశితంగా రూపొందడం అత్యంత విశేషం.

★ ఈమెను పరిచయం చేసుకుంటూ కరచాలనం చేస్తే ఆ స్పర్శ ద్వారా ఆ వ్యక్తిని చాలా కాలం తరువాత కూదా ఇట్టే పసికట్టి ఫలానా అని చెప్పగలిగేవారు.

★ మన దేశం వచ్చిన సందర్భంలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గళంలోని సంగీత మాధుర్యాన్ని, ఈమె తన చేతి వేళ్ళద్వారా ఆమె గొంతును తాకుతూనే నిర్థారించ గలిగారు.

★ అంతే కాదు. మనిషి నడుస్తున్నప్పుడు సహజంగా ఏర్పడే భూప్రకంపనాల తారతమ్యాలను అనుసరించి ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని అంచనా వేసేవారు.

★  ఈ తరహాలో అనేక అధ్భుత మానసిక శక్తులతో ప్రపంచ దేశాలన్నిటినీ ఆకట్టుకొని, వికలాంగుల సేవా కేంద్రాలను ఎల్లెడలా నెలకొల్పడానికి పురికొల్పారు.

అంధుల సేవ..
◆ తన జీవితాన్ని అంధుల సేవకు స్వచ్చందంగా అర్పించుకొని, అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సంస్థను స్థాపించి, దాని నిధి సేకరణకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. సమావేశాలు, సదస్సులను నిర్వహించాడు. భారీ స్థాయిలో నిధులు సేకరించి వికలాంగుల ఉద్ధరణకు వ్యయం చేశారు.

◆ ఆ సందర్భంలోనే 1955 లో భారతదేశ పర్యటన జరిపారు. రాజధాని ఢిల్లీలో ప్రధాని నెహ్రూ అధ్యక్షతన బ్రహ్మాండమైన బహిరంగసభ జరిగింది.

★ "1955 భారత దేశ పర్యటన చేస్తూ ఢిల్లీలో ప్రధాని నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటయిన సభలో పాల్గొన్న సందర్భంలో చిన్న ఆశా భావాన్ని వ్యక్తపరిచారు.

నెహ్రూను ఒకసారి తాకి చూడాలన్నారు. నెహ్రూ కూడా ఆమోదించారు.
కెల్లర్ నెహ్రూ ను ఒకసారి స్పర్శించి ఆ తర్వాత నెహ్రూ మోమును చేతులను స్పర్శించి ఆ తర్వాతనెహ్రూ ఒక కళా ఖండమని, శాంత స్వరూపుడని, విశాల హృదయుడని, సాధారణ పా లకుడని అభివర్ణిస్తూ అంచనా వెలిబుచ్చారు."

■ వికలాంగులను దయాదాక్షిణ్యాలతో పోషించటం కాదు వదాన్యుల కర్తవ్యం. వారి స్వశక్తితో వారు నిలబడే అవకాశాల కల్పన ద్వారా వారిలో ఆత్మస్థయిర్యం, మనో నిబ్బరం కల్పించడమే ఈ సమస్యకు సముచిత పరిష్కారమని కెల్లర్ ప్రగాఢంగా విశ్వసించి, ఆదర్శవంతమైన సార్థక సేవా దృక్పధానికీ బీజం వేశారు.

■ అమెరికా,ఇంగ్లాండ్,స్వీడన్ వంటి అనేకానేక దేశాలలో ఈమె పేరు మీద సేవా కేంద్రాలు నెలకొల్పబడి ఈ నాటికీ కొనసాగుతున్నాయి.

■ 1902 లో ప్రారంభించిన రచనా వ్యాసాంగాన్ని, జీవిత పర్యంతర కొనసాగించారు. "ద స్టోరీ ఆఫ్ ద డార్క్‌నెస్" అనంతరం మై రెలిజియన్, ద వరల్డ్ ఐ లివ్ ఇన్, అవుట్ ఆఫ్ ద డార్క్‌నెస్, ద ఓపెన్ డోర్, లెట్ ఆజ్ హావ్ ఫెయింగ్, ద సాంగ్ ఆఫ్ ద స్టోరీ వెల్ మొదలైన గ్రంథరచనలను వెలువరించారు.

■ ఈమె జీవిత కథను ఆధారం చేసుకుని పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు రూపొందిచారు. ఆస్కార్ అవార్డు(1955) కూడా లభించింది.

అవార్డులు - రివార్డులు..
★ అమెరికా దేశపు అత్యున్నత అవార్డ్ "ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్" అవార్డు
★ పిలిప్పీన్స్ దేశపు " గోల్డెన్ హార్ట్ " అవార్డు
★ లెబనాన్ దేశపు "ఆర్డర్ ఆఫ్ క్రాస్" అవార్డు
★ జపాన్ ప్రభుత్వం వారి "సీక్రెట్ ట్రిషర్" అవార్డు.
★ బ్రెజిల్ దేశపు ఆర్డర్ ఆఫ్ క్రాస్ అవార్డు.
★ ప్రపంచంలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో డాక్టరేట్లు
★ ప్రెంచ్ జాతీయ వికలాంగుల సంస్థ గౌరవ సభ్యురాలు.

(జ:జూన్27,1880-మ:జూన్1,1968) 
             

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...