Skip to main content

Noble Person in History - J.D. Birla

👴🏻🏭➖➖➖➖➖➖➖➖
*భారతీయ వ్యాపారవేత్త. ఘనశ్యాం దాస్ బిర్లా(జె.డి. బిర్లా)వర్దంతి నేడు..
➖➖➖➖➖➖➖🌸🌸🍃
_బిర్లా,మహాత్మాగాంధీ యొక్క మిత్రుడు. గాంధీ తన చివరి రోజుల్లో ఢిల్లీలో ఉన్న సమయంలో బిర్లా నివాసంలోనే ఉండేవాడు._

*★ జె.డి. బిర్లాగా పిలవబడే ఘన్ శ్యామ్ దాస్ బిర్లా భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని. హిందుస్థాన్ మోటార్ సంస్థ స్థాపకుడు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) ప్రారంభకుడు.*

*🍥కుటుంబం,బాల్యం,విద్య..*

■ ఆయన 1894 ఏప్రిల్ 10 వతేదీన పిలాని  గ్రామంలో పుట్టాడు.ఘన్ శ్యామ్ దాస్ తాత గారైన శివనారాయణ బిర్లా పిలాని ప్రాంతంలో పెద్ద వ్యాపారి. ఇతడు తరువాతి కాలంలో  కలకత్తా వెళ్ళి బట్టల వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారం పుంజుకొన్న తరువాత పిలాని గ్రామంలో ఒక హవేలీ నిర్మించాడు. ఇప్పటికీ ఉన్న దానిని బిర్లా హవేలి అంటున్నారు. అతడు నవల్గర్  కుటుంబం నుండి ఘన్ శ్యామ్ దాస్ తండ్రి అయిన బలాదియోదాస్ను పెంపకానికి తెచ్చుకొన్నాడు.

*🍥వ్యాపారం..*

*■ఘన్ శ్యామ్ కూడా తాత తండ్రుల వలే కలకత్తా వెళ్ళి బట్టల వర్తకం సాగించాడు. దానితో పాటు వస్తుతయారీ యూనిట్లను దేశం నలుమూలలా స్థాపించాడు. 50 లక్షల పెట్టుబడి దాటిన తరువాత తన సోదరులతో కలిసి 1919లో గ్వాలియర్ పట్టణంలో సొంతానికి మిల్లు స్థాపించాడు. తరువాత బిర్లా రాజకీయాలలో రాణించాడు.*

*■1926లో బ్రిటిష్ వారి హయాంలో శాసనసభకు వెళ్ళాడు. తరువాత కార్ల వ్యాపారంలో ప్రవేశించి 1940లో హిందూస్తాన్ మోటార్స్ అనే సంస్థను స్థాపించాడు. దీని తరువాత సిమెంట్, ఇనుము, కెమికల్స్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలలో రాణించాడు.  1943 ప్రాంతంలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యుకో/UCO) అనే సంస్థను కలకత్తాలో ప్రారంభించాడు. 1983 లో తన 90 వ ఏట మరణించాడు.*

*🍥అవార్డులు, సత్కారాలు..*

★1957లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ తో గౌరవించింది.

(జ:ఏప్రిల్ 10,1894-మ:జూన్11,1983)
             🍃🌸🤗🌸🍃

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...