Skip to main content

General Knowledge - State & Central Relationships !!


కేంద్ర - రాష్ట్ర సంబంధాలు
1. భారత రాజ్యాంగం ప్రకారం కింద పేర్కొన్నవాటిలో సరికాని జత ఏది?(సివిల్ సర్వీసెస్ 2004)
ఎ) అడవులు - ఉమ్మడి జాబితా
బి) ప్రజారోగ్యం - రాష్ట్ర జాబితా
సి) పోస్టాఫీస్ సేవింగ్ - కేంద్ర జాబితా 
డి) స్టాక్ ఎక్స్ఛేంజ్ - ఉమ్మడి జాబితా
View Answer
సమాధానం: డి
2. కిందివాటిలో ఏడో షెడ్యూల్‌లోని కేంద్ర జాబితాలో ఉన్న అంశం ఏది?(సివిల్ సర్వీసెస్ 2006)
ఎ) మత్స్య పరిశ్రమ 
బి) గనులు, చమురు క్షేత్రాల్లో పనిచేసే శ్రామికులు, వారి భద్రతను క్రమబద్ధీకరించడం 
సి) ప్రజారోగ్యం
డి) వ్యవసాయం
View Answer
సమాధానం: బి
3. కింది వ్యాఖ్యలను పరిశీలించండి. (సివిల్ సర్వీసెస్ 2004)
1) భారత ప్రణాళికలను నిర్ణయించే అత్యున్నత సంస్థ - భారత ప్రణాళికా సంఘం
2) ప్రణాళిక సంఘం కార్యదర్శి జాతీయాభివృద్ధి మండలి కార్యదర్శిగానూ వ్యవహరిస్తారు.
3) రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉమ్మడి జాబితాలో ఆర్థిక సామాజిక ప్రణాళికను చేర్చారు.
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైంది ఏది? 
ఎ) 1, 2
బి) 2, 3 
సి) 2 మాత్రమే
డి) 3 మాత్రమే
View Answer
సమాధానం: సి
4. శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందినవి? (గ్రూప్-1, 1991)
ఎ) కేంద్ర జాబితా
బి) ఉమ్మడి జాబితా 
సి) రాష్ట్ర జాబితా
డి) ఏదీకాదు
View Answer
సమాధానం: సి
5. విద్య ఏ జాబితాకు చెందింది? (ఎస్.ఐ. 1981)
ఎ) రాష్ట్ర 
బి) కేంద్ర 
సి) ఉమ్మడి
డి) ఏదీకాదు
View Answer
సమాధానం: సి
6. భారత రాజ్యాంగం సమాఖ్యపూరితమైందని తెలియజేసేది? (సివిల్ సర్వీసెస్ 1994)
ఎ) స్వతంత్ర న్యాయవ్యవస్థ
బి) లిఖిత రాజ్యాంగం 
సి) కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన
డి) పైవన్నీ
View Answer
సమాధానం: డి
7. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా వర్ణించిందెవరు? 
ఎ) ఆస్టిన్
బి) మారిస్‌జోన్స్
సి) కె.సి. వేర్
డి) ఆపిల్ బీ
View Answer
సమాధానం: సి
8. ‘రాజ్యాంగం అవలంబించిన రాజకీయ వ్యవస్థ కాలం, పరిస్థితులకు అనుగుణంగా ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది’ అని ఎవరన్నారు?
ఎ) అంబేద్కర్ 
బి) నెహ్రూ
సి) పటేల్
డి) ఆపిల్ బీ
View Answer
సమాధానం: ఎ
9. కేంద్ర - రాష్ర్ట ఆర్థిక సంబంధాలపై సిఫారసులు చేసేది?
ఎ) సర్కారియా కమిషన్
బి) ఆర్థిక మంత్రి
సి) ఆర్థిక సంఘం
డి) ప్రణాళికా సంఘం
View Answer
సమాధానం: సి
10. కేంద్ర - రాష్ర్ట సంబంధాల్లో సమస్యలకు ప్రధాన కారణం?
ఎ) ఆర్థిక వనరుల కేటాయింపు
బి) నదీ జలాల వివాదం
సి) రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం
డి) పైవేవీ కాదు
View Answer
సమాధానం: సి
11. కింది వాటిలో కేంద్ర - రాష్ర్ట సంబంధాలతో సంబంధం లేనిది? 
ఎ) ఇంద్రజిత్ గుప్త కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) సర్కారియా కమిషన్
డి) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమోరాండం
View Answer
సమాధానం: ఎ
12.కింది వాటిలో కేంద్ర, రాష్ర్ట సంబంధాలతో సంబంధం లేనిది? 
ఎ) ఇంద్రజిత్ గుప్తా కమిటీ 
బి) పశ్చిమబెంగాల్ ప్రభుత్వ మెమొరాండం
సి) రాజమన్నార్ కమిటీ 
డి) సర్కారియా కమిషన్
View Answer
సమాధానం: ఎ
13. రెండో పరిపాలనా సంస్కరణల సంఘం అధ్యక్షుడు ఎవరు?
ఎ) సి. రంగరాజన్
బి) వినోద్ రాయ్
సి) వీరప్పమొయిలీ
డి) వినితారాయ్
View Answer
సమాధానం: సి
14. ఎన్నికల అజమాయిషీ, సూచనలు, నియంత్రణ ఎన్నికల సంఘం చేతుల్లో ఉండాలని ఏ రాజ్యాంగ అధికరణ తెలుపుతుంది?
ఎ) 324
బి) 323
సి) 325
డి) 326
View Answer
సమాధానం: ఎ
15.కింది వాటిలో ఏ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర, రాష్ర్ట సంబంధాలను పునర్ నిర్వచించింది? 
ఎ) ఇంద్ర సహానీ కేసు
బి) రాయనరావు కేసు
సి) ఎస్.ఆర్. బొమ్మయ్ కేసు
డి) ఐ.ఆర్. కొయల్‌హో కేసు
View Answer
సమాధానం: సి
16. కేంద్ర, రాష్ర్ట సంబంధాలకు సంబంధించి డి.ఆర్.గాడ్గిల్ సూత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? 
ఎ) పన్నుల రాబడుల విభజన 
బి) రాష్ర్ట రుణాల మాఫీ 
సి) రాష్ట్రాలు కొత్త అప్పులు చేయకుండా ఉండటానికి 
డి) రాష్ట్రాలకు కేంద్ర సహాయాన్ని సమకూర్చడానికి
View Answer
సమాధానం: డి
17. సర్కారియా కమిషన్ అధ్యయన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
ఎ) 1988
బి) 1989
సి) 1987
డి) 1986
View Answer
సమాధానం: సి
18. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ) సర్కారియా కమిషన్
బి) రాజమన్నార్ కమిషన్ 
సి) ఖేర్ కమిషన్ 
డి) కాకా కలేల్కర్ కమిషన్
View Answer
సమాధానం: బి

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...