Skip to main content

భారత దేశ స్వాతంత్ర్య పోరాటం - సాయుధ విప్లవ యోధుడు - దేవునిపల్లి

*సాయుధ విప్లవ యోధుడు దేవులపల్లి*

రైతు, కూలీల చేతి కర్రను ఆయుధంగా మలిచి, వారిని సాయుధులను చేసి, తెలంగాణ గ్రామాల్లో దేశ్‌ముఖ్‌ల పీడనపై పోరాటం జరిపించిన విప్లవ యోధుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు. నిజాం నిరంకుశపాలనను  కూలదోయటంలో కీలక భూమిక పోషించిన సాయుధ విప్లవ నేత. నల్లగొండ జిల్లా బండకింద చందుపట్ల గ్రామానికి చెందిన డీవీ వరంగల్‌ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో 1917 జూన్‌ 1న జన్మించారు. బాల్యంలోనే కాళోజీ వంటి వారితో సాన్నిహిత్యం ఏర్పడింది. డీవీ ఉస్మానియాలో బీఏ చదువుతున్నప్పుడు ‘వందేమాతరం’ ఉద్యమంలో పాల్గొనడంతో కళాశాలనుంచి బహిష్కరించారు.

నాగ్‌పూర్‌లో బీఏ పూర్తి చేసి, స్వగ్రామానికి తిరిగి వచ్చి, అప్పటికే నిషేధానికి గురైన కమ్యూనిస్టు పార్టీలో 22వ ఏట కార్యకర్తగా చేరారు. జిల్లా అంతటా పర్యటించి విసునూరు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వలంటీరు దళాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తరువాత యూని యన్‌ సైన్యాలకు కూడా ఎదురొడ్డి నిలబడడానికి కమ్యూనిస్టు దళాలకు సైనిక శిక్షణ ఇవ్వడంతోపాటు, వాటిని ముందుండి నడిపారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనం తరువాత  కూడా 1951 వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ సాయుధపోరాటం లోటుపాట్లను వివరిస్తూ  తన చివరి దశలో ‘తెలంగాణ ప్రజల సాయుధపోరాట చరిత్ర’ ఉద్గ్రంథాన్ని రెండు భాగాలుగా రచించారు.

సాయుధపోరాట విరమణ తరువాత 1957లో జరి గిన ఎన్నికల్లో దేవులపల్లి పార్లమెంటుకు అత్యధిక మెజారిటీతో ఎన్నికైనప్పటికీ, ఆ పంథాతో సమాధానపడలేకపోయారు. పార్టీ చీలినప్పుడు ఆయన సీపీఎం వైపు వచ్చారు. దానిలో కేంద్రకమిటీ సభ్యుడిగా ఉన్నారు. శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో సీపీఎం నుంచి బైటికొచ్చినవారితో ఏర్పడిన ఆంధ్రా కమ్యూనిస్టు కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. విప్లవోద్యమ నిర్మాణంలో తరి మెల నాగిరెడ్డితో దేవులపల్లికి ఉన్న స్నేహ సంబంధాలు విడదీయరానివి. మద్రాసులో నాగిరెడ్డితోపాటు 1969లో అరెస్టయినప్పుడు జైల్లో దేవులపల్లి ‘భారత జనతా ప్రజాతంత్రవిప్లవం’ అనే గ్రంథాన్ని రచించారు.
ఇరువురూ కలిసి 1975లో ‘భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రాన్ని స్థాపించారు. ఎమర్జెన్సీ విధిం చడంతో దేవులపల్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలో  ఉంటూనే 1984 జూలై 12వ తేదీన తన 67వ ఏట తుదిశ్వాస విడిచారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదేళ్లు జైల్లో, ఇరవై ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. బహిరంగంగా ఉన్న ఆ ఇరవైఏళ్లు కూడా ప్రజలకోసమే జీవించారు. వరంగల్‌లో జరిగిన ఆయన సంతాప సభలో కాళోజీ నారాయణరావు మాట్లాడుతూ ‘అన్యాయాన్ని ఎదిరించేవాడిని నేను ఆరాధిస్తాను. అందుకే దేవులపల్లి నాకు ఆరాధ్యుడు, పూజనీయుడు’ అని నివాళులర్పించారు.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...