రాష్ట్రకూటులు(క్రీ.శ.696-710)
మూల పురుషుడు మొదటి ఇంద్ర రాజు (క్రీ.శ.696-710) మొదట్లో చాళుక్య వంశ సామంతులుగా ఉండేవారు
దంతిదుర్గుడు (క్రీ.శ.748-758) :– స్వతంత్ర రాజ్య స్థాపకుడు.క్రీ.శ.738 లో జరిగిన యుద్ధంలో అరబ్బులను ఓడించాడు.ఇతని యొక్క బిరుదులు పృథ్వీవల్లభ, ఖడ్గావలోక, మహారాజాధిరాజా, పరమహేశ్వర, పరామభట్టారక.
మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-772) :– ఇతనికి సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు కలవు. ఇతను ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీనికి 'World Heritage Site' గుర్తింపు లభించింది.
రెండవ గోవిందుడు (క్రీ.శ.780-792) :– ఇతన్ని సువర్ణ గోవిందరాజు, ప్రఖాత వర్షుడు అని అంటారు
ద్రువరాజు (క్రీ.శ.780-792) :– ఇతని యొక్క బిరుదులు శ్రీవల్లభ, నిరూప కేలివల్లభ, దానార్ణవ
మూడవ గోవిందుడు ( క్రీ.శ. 793-814) :– ఇతను రాష్ట్ర కూటుల్లో అగ్రగణ్యుడు
అమోఘవర్షుడు (క్రీ.శ.814-880) :– ఇతని యొక్క అసలు పేరు శర్యుడు. ఇతను 'కవిరాజ మార్గం' అనే అలంకార గ్రంధాన్ని రచించాడు. ప్రశ్నోత్తర రత్నమాలిక అనే కావ్యాన్ని రచించాడు.ఇతనికి 'కవిరాజు' అనే బిరుదు కలదు.ఇతడు 'మాన్యఖేట' నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు
Comments
Post a Comment