Skip to main content

రాష్ట్రకూటులు (క్రీ.శ.696-710)

రాష్ట్రకూటులు(క్రీ.శ.696-710)

మూల పురుషుడు మొదటి ఇంద్ర రాజు (క్రీ.శ.696-710) మొదట్లో చాళుక్య వంశ సామంతులుగా ఉండేవారు 
దంతిదుర్గుడు (క్రీ.శ.748-758) :– స్వతంత్ర రాజ్య స్థాపకుడు.క్రీ.శ.738 లో జరిగిన యుద్ధంలో అరబ్బులను ఓడించాడు.ఇతని యొక్క బిరుదులు పృథ్వీవల్లభ, ఖడ్గావలోక, మహారాజాధిరాజా, పరమహేశ్వర, పరామభట్టారక. 
మొదటి కృష్ణుడు (క్రీ.శ.758-772) :– ఇతనికి సుభత్తుంగ, అకాలవర్షుడు అనే బిరుదులు కలవు. ఇతను ఎల్లోరాలోని కైలాస దేవాలయాన్ని (ఏకశిలా నిర్మితం) నిర్మించాడు. దీనికి 'World Heritage Site' గుర్తింపు లభించింది. 
రెండవ గోవిందుడు (క్రీ.శ.780-792) :– ఇతన్ని సువర్ణ గోవిందరాజు, ప్రఖాత వర్షుడు అని అంటారు 
ద్రువరాజు (క్రీ.శ.780-792) :– ఇతని యొక్క బిరుదులు శ్రీవల్లభ, నిరూప కేలివల్లభ, దానార్ణవ 
మూడవ గోవిందుడు ( క్రీ.శ. 793-814) :– ఇతను రాష్ట్ర కూటుల్లో అగ్రగణ్యుడు 
అమోఘవర్షుడు (క్రీ.శ.814-880) :– ఇతని యొక్క అసలు పేరు శర్యుడు. ఇతను 'కవిరాజ మార్గం' అనే అలంకార గ్రంధాన్ని రచించాడు. ప్రశ్నోత్తర రత్నమాలిక అనే కావ్యాన్ని రచించాడు.ఇతనికి 'కవిరాజు' అనే బిరుదు కలదు.ఇతడు 'మాన్యఖేట' నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...