Skip to main content

మీకు తెలుసా? 'మిని రాజ్యాంగం' అని ఏ చట్టాన్ని పిలుస్తారు?

'మిని రాజ్యాంగం' అని ఏ చట్టాన్ని పిలుస్తారు?  

           భారత రాజ్యాంగంపై బ్రిటిషు ప్రభుత్వ చట్టాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వీటి ప్రభావం వల్ల మన జాతీయోద్యమంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటిషు ప్రభుత్వం రూపొందించిన రెగ్యులేటింగ్‌ చట్టం- 1773 నుండి భారత స్వాతంత్య్ర చట్టం- 1947 వరకు ఇటు భారతీయుల్లోను, భారత, నూతన రాజ్యాంగ రూపకల్పనలో చాలా ప్రభావం చూపాయి. అందులో *ముఖ్యమైన చట్టాలు.*

ఎ) *రెగ్యులెటింగ్‌ చట్టం- 1773*:

భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్యానికి విరుద్ధంగా తొలిసారిగా బ్రిటిషు సార్వభౌమత్వాన్ని నిర్ధారించడం వల్ల మన దేశంలో బ్రిటిషు పాలన ప్రారంభం అయ్యింది.

- బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ హోదాను పెంచుతూ గవర్నర్‌ జనరల్‌గా పేరు మార్చారు. మొదటి గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్‌.

- ఈ చట్టం ద్వారా మొదటి సుప్రీం కోర్టును 1774 కలకత్తాలో స్థాపించారు.

బి) *పిట్స్‌ ఇండియా చట్టం - 1784*: ఈ చట్టం ద్వారా బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఆదిపత్యం సుస్థిరం చేసింది.

సి) *చార్టర్‌ చట్టం -1793*: లండన్‌లో భారత వ్యవహారా లకు చెందిన బోర్డు ఆఫ్‌ కంట్రోల్‌ సభ్యుల జీతాలను ఈస్టిండియా కంపెనీ చెల్లిస్తుంది.

డి) *చార్టర్‌ చట్టం- 1813:* ఈ చట్టం ద్వారా 20 సంవత్స రాలు ఈస్టిండియా పాలన కొనసాగించారు.

ఇ) *చార్టర్‌ చట్టం- 1833*: ఇండియన్‌ గవర్నర్‌ జనరల్‌ పేరు మార్చారు. మొదటి గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింగ్‌.

భారతీయ లా కమిషన్‌ను లార్డు మెకాలె ఏర్పాటు చేసారు.

ఎఫ్‌) *చార్టర్‌ చట్టం- 1853*: ఈ చట్టం ద్వారా ఇండియన్‌ సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్స్‌ను ఏర్పాటు చేశారు.

సిపియస్‌, ఐపిసి, సిఆర్‌పిసి రూపొందించి 1861 నుంచి అమల్లోకి వచ్చినవి.

*జి) విక్టోరియా రాణి ప్రకటన- 1858*: ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలన అంతమై బ్రిటిషు రాజు లేదా రాణి పరిపాలన ఏర్పడింది.

- గవర్నర్‌ జనరల్‌ పేరును వైస్రారు ఆఫ్‌ ఇండియాగా మార్చారు. ద్వంద పాలన రద్దు.

- బ్రిటిషు రాణి భారత సామ్రాజ్ఞ బిరుదు ధరించింది.

- భారత ప్రజల ఆస్తి, వారసత్వ అధికారాలను రక్షించే భాధ్యతను బ్రిటిషు ప్రభుత్వం స్వీకరించింది.

హెచ్‌. 1) *1861 భారత కౌన్సిల్‌ చట్టం:* ఈ చట్టం శాసన నిర్మాణ ప్రక్రియలు మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు.

జె. 2) *1892 భారత కౌన్సిల్‌ చట్టం:* ఈ చట్టం ద్వారా తొలిసారిగా భారతదేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టారు.

3) *భారత ప్రభుత్వం 1909 (మింటో మార్లే సంస్కరణలు)*: 

మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు.

కార్యనిర్వాహక మండలిలో మొదటిగా సత్యేంద్రప్రసాద్‌ సిన్హా (భారతీయులకు) సభ్యత్వం కల్పించారు.

లార్డ్‌ మింటోను ''మత నియోజక గణాల'' పితామహుడిగా పిలుస్తారు.

ఈ చట్టం హిందు-ముస్లింల మధ్య అడ్డుగోడలు సృష్టించినది అని జవహర్‌లాల్‌ నెహ్రూ విమర్శ.

4. *భారత ప్రభుత్వ చట్టం- 1919 (మాంటేంగ్‌- చేమ్స్‌ఫర్డు సంస్కరణలు)*: 

మనదేశంలో ద్వంద్వపాలన లెజిస్టేటివ్‌ అసెంబ్లీ (దిగువ సభ), కౌన్సిలర్‌ స్టేట్స్‌(ఎగువసభ)లను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర పాలన అంశాలను రిజర్వ్‌డ్‌, ట్రాన్స్‌ఫర్డుగా విభజించడం జరిగింది.

5. *భారత ప్రభుత్వ చట్టం-1935, ఆగస్టు-2*: ఈ చట్టంలో 321 అధికరణలు ఉన్నాయి. బ్రిటిషు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ చట్టాలన్నింటిలోను 1935 చట్టం అత్యంత కీలకమైనది.

ద్వంద్వ పాలన రద్దు.

కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాగా అధికారాల విభజన.

భారత్‌ నుంచి బర్మా (మయన్మార్‌)ను విడదీయడం.

ఢిల్లీలో ఫెడరల్‌ కోర్టు ఏర్పాటు.

ఆర్‌బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఏర్పాటు.

ఓటుహక్కు విస్తరణ.

అఖిల భారత సమాఖ్య అనే నూతన వ్యవస్థను ఈ చట్టం ప్రవేశపెట్టింది.

1933లో బ్రిటిష్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, బ్రిటిషు ప్రధానమంత్రి రామ్‌సేమెక్‌డొనాల్డ్‌ జారీ చేసిన కమ్యూనల్‌ అవార్డులు ఈ చట్టానికి మూలాధారం.

క్రిప్స్‌ ప్రతిపాదనలు 1942 మార్చి 11న : రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు చేసి స్వయం ప్రతిపత్తి ఇస్తామని ప్రకటన.

క్యాబినెట్‌ మిషన్‌ - 1946 మే 16న: రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు అవుతుందని ప్రకటన. సెప్టెంబర్‌ 2, 1946 నెహ్రూ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ప్రకటన.

అట్లి ప్రకటన - 1947 ఫిబ్రవరి 20: బ్రిటన్‌ కామన్స్‌ సభలో మాట్లాడుతూ 1948 జూన్‌ వరకు బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌ నుండి వైదొలుగుతుందని ''అట్లి'' ప్రకటించాడు.

బ్రిటిష్‌ వారు జారీ చేసిన వాటిలో అత్యుత్తమమైనదిగా గాంధీజీ కొనియాడారు.

భారత స్వాతంత్య్ర చట్టం- 

*1947: ఈ చట్టాన్ని 'లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ ప్రణాళిక'* అని కూడా అంటారు. బ్రిటిష్‌ పార్లమెంట్‌ భారత స్వాతంత్య్ర చట్టాన్ని 1947 జూలై 5న ఆమోదించింది. బ్రిటిషు రాణి 1947 జూలై 18న సంతకం చేశారు.1947 ఆగస్టు 15 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. 

ఈ చట్టం ద్వారా భారతదేశం విభజించబడి ఇండియా, పాకిస్థాన్‌లు అనే రెండు రెండు స్వతంత్య్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి.

భారత్‌పై బ్రిటిష్‌ పార్లమెంట్‌ అధికారం అంతం.

భారత కార్యదర్శి పదవి రద్దు.

భారత్‌ కామన్‌వెల్త్‌ నుండి వైదొలిగే స్వేచ్ఛను ఇచ్చారు

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...