Skip to main content

మీకు తెలుసా? మంచు ప్రదేశాల్లో నివసించే పెంగ్విన్‌ పక్షుల పాదాలు అక్కడి మంచు గడ్డలకు ఎందుకు అంటుకోవు?

🔲ప్రశ్న: మంచు ప్రదేశాల్లో నివసించే పెంగ్విన్‌ పక్షుల పాదాలు అక్కడి మంచు గడ్డలకు ఎందుకు అంటుకోవు?

జవాబు: మంచు గడ్డలు పరుచుకొని ఉండే ప్రదేశంపై మనం నడిస్తే ఒత్తిడి వల్ల, మన దేహ ఉష్ణోగ్రత వల్ల మన కాళ్ల కింద మంచుగడ్డ కరుగుతుంది. ఆ ఒత్తిడిని కొంత సడలించగానే కరిగిన ఆ మంచు మరల గడ్డకట్టడంతో మన పాదాలు మంచు గడ్డకు అంటుకుంటాయి. కానీ పెంగ్విన్‌ పక్షుల విషయంలో అలా జరగదు. పెంగ్విన్ల దేహ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నా, వాటి కాళ్లు ఎప్పుడూ చల్లగానే ఉంటాయి. అవి మంచుగడ్డపై కలిగించే ఒత్తిడి తక్కువే. అందువల్ల అవి మంచు గడ్డలున్న ప్రదేశాలల్లో ఉన్నా వాటి పాదాలకు మంచుగడ్డల మధ్య మంచు కరిగిన నీరు ఏర్పడదు. ఆ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు. పెంగ్విన్ల పాదాలు ఎల్లవేళలా చల్లగా ఉండడానికి కారణం వాటి కాళ్లలో ప్రవహించే రక్తం నియంత్రించబడి ఉండడమే. వాటి కాళ్లలో ఉండే రక్తనాళాలు, ధమనుల చుట్టూ ఉండే కండరాల అమరిక వల్ల వాటి పాదాల ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెల్సియస్‌ కన్నా కొంచెం ఎక్కువగా మాత్రమే ఉండేటట్టు రక్తం అతి తక్కువగా ప్రవహిస్తుంది. ఇలా జరగడం వల్ల చల్లబడిన రక్తం మరలా దేహంలోకి తిరిగి వచ్చి అక్కడ ఉండే అనేక వెచ్చని రక్తనాళాలు, ధమనుల గుండా ప్రవహించి వేడెక్కుతుంది. అంటే తిరిగి తొలి ఉష్ణోగ్రతను చేరుకుంటుంది. ఆ విధంగా పెంగ్విన్‌ పాదాలు మంచుగడ్డలకు అంటుకోవు. 

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...