Skip to main content

వినూత్న సదుపాయాలతో టి-వాలెట్ !!

వినూత్న సదుపాయాలతో టి-వాలెట్ !!
- లావాదేవీలపై రుసుము లేదు
- ఎక్కడి నుంచియైన ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చు.

విద్యుత్తు బిల్లులు చెల్లించాలంటే ఇకపై వరసలో నిల్చోవాల్సిన పని లేదు. సమయం ఏదైనా .. మీరెక్కడున్నా.. బిల్లులు చెల్లించవచ్చు.
స్మార్ట్ ఫోన్ తోనే కాకుండా ... సాధారణ (ఫీచర్) ఫోన్ తో కూడా బ్యాంక్తో సంబంధం లేకుండా డిజిటల్ లావాదేవీలకు వీలు కల్పించే .. అన్నింటినికి మించి ఎలాంటి రుసుము లేని వినూత్న ఫీచర్స్ తో కూడిన టి-వాలెట్ ను తెలంగాణ సర్కారు గురువారం ఆవిష్కరించింది. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి డిజిటల్ వాలెట్ ని ఆవిష్కరించడం ఇదే తొలి సారి. గ్రామీణ ప్రాంతాలలో కూడా వాడకం పెరిగేందుకు తెలుగు, ఉర్దూ భాషలో కూడా దీనిని తీసుకు వచ్చారు.

ఆధార్ కార్డులని పర్యవేక్షించే ఉదాయ్ సంస్థ చైర్మన్ జె. సత్యనారాయణ సమక్షంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ గురువారం హైద్రాబాద్ లో దీనిని ఆవిష్కరించారు.

డౌన్ లోడ్ చేసుకోవటం ఎలా?

గూగుల్ ప్లే స్టోర్ లో 'టి వాలెట్ తెలంగాణ' అని టైప్ చేసి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఫీచర్ ఫోన్ (ఇంటర్నెట్ లేని) వారు ఈ-సేవ - మీ సేవ కేంద్రాల ద్వారా టి-వాలెట్ ను తమ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డెస్క్ టాప్ లో నైతే http://twallet.telangana.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఉపయోగించటం ఎలా?

👍 స్మార్ట్ ఫోన్ వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డులతో , ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మరియు ఫీచర్ ఫోన్ ఉన్న వారు, ఫోన్ లేని వారు మీ సేవా కేంద్రాల ద్వారా టి-వాలెట్ లో డబ్బులు వేసుకోవచ్చు.
👍 ఆర్బీఐ నిబంధనలు ప్రకారం ఇ-కేవైసీ వినియోగదారులయితే టి-వాలెట్ లో గరిష్టంగా ఏ సమయంలో నయినా ఒక లక్ష రూపాయల దాకా వుంచుకోవచ్చు. ఇ-కేవైసీ లేని వారు నెలలో 20 వేల కు మించకూడదు.

టి-వాలెట్ ప్రత్యేకతలు

👍 ప్రజలు ప్రభుత్వానికి బిల్లులు చెల్లించటమే కాకుండా ప్రభుత్వం చెల్లించే ఉపకారవేతనాలు, పింఛన్ల లాంటి వాటిన మున్ముందు టి-వాలెట్ ద్వారానే చెల్లించే వెసులుబాటు.

👍 ఓటిపి (స్మార్ట్ ఫోన్ లకు) , బయోమెట్రిక్-ఆధార్ (ఫీచర్ ఫోన్లు, ఫోన్ లేని వారికి) అనుసంధానం ద్వారా భద్రతకు ఇబ్బంది లేకుండా చూడటం.

వేటికి వాడొచ్చు
☺ ప్రభుత్వ బిల్లులు, ఆస్తిపన్ను, వాణిజ్య అనుమతులు, నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు..తదితరాలు చెల్లించడానికి

☺ ఆర్టీఏ చాలన్లు చెల్లించేందుకు

☺ ఈ-సేవా/మీ సేవాల ద్వారా సేవలకు

☺ మున్ముందు ఫోన్ రిచార్జీలు, బస్ టికెట్స్ తదితరులకు కూడా...

☺ ఉపకార వేతనాలు, పింఛన్లు కూడా వీటి ద్వారానే ప్రభుత్వం చెల్లిస్తుంది..

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...