Skip to main content

దేవుని దర్శనం తర్వాత గుడిలో ఎందుక్కూర్చోవాలి?

దేవుని దర్శనం తర్వాత గుడిలో ఎందుక్కూర్చోవాలి?

సాధారణంగా మనం దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక కొంచెం సేపు కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కూర్చుంటామో చాలా మందికి తెలియదు. మరి కొంతమందైతే దైవ దర్శనం కాగానే హడావిడిగా వెళ్లి పోతూ ఉంటారు. నిజానికి దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంచెం సేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇప్పుడు దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవడానికి గల శాస్త్రీయమైన కారణాలను తెలుసుకుందాం. 

*గుడి ప్రదేశాల్లో విద్యుత్,అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి 'పాజిటివ్' శక్తి విరివిగా లభ్యం అయ్యే ప్రదేశంలో దేవాలయాలను నిర్మిస్తారు.* 

ఈ ప్రదేశం యొక్క కేంద్ర స్థానంలో మూల విరాట్ ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూల స్థానం అంటారు. ఈ మూల స్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. 

*మూల విరాట్ అడుగు భాగంలో వేద మంత్రాలను వ్రాసిన రాగి రేకులను ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి చుట్టు పక్కలకు ప్రసారం చేస్తాయి.* 

*భక్తులు ప్రతి రోజు గుడికి వచ్చి సవ్య దిశలో ప్రదక్షిణలను చేస్తే, ఆ వ్యక్తి యొక్క శరీరం, మూల విరాట్ అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేసే అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది.* 

ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది. అందువల్ల మన పెద్దవారు ప్రదక్షిణ చేసే సమయంలో నిదానంగా, ప్రశాంతంగా చేయాలని చెబుతూ ఉంటారు. ఈ ధనాత్మక శక్తి మనం ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. 

*గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు,శరీరం ఉత్తేజితం అవుతాయి. 

గుడిలో దేవుని మహిమ, మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతాయి.* 

అలాగే చెడు ఆలోచనలు కలుగకుండా మంచి నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రోత్సాహం కలుగుతుంది. 

*దైవ సన్నిధిలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి మెరుగు అయ్యి రెట్టింపు ఫలితాలను పొందుతాం.* 

*అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెం సేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.*

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...