దేవుని దర్శనం తర్వాత గుడిలో ఎందుక్కూర్చోవాలి?
సాధారణంగా మనం దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక కొంచెం సేపు కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కూర్చుంటామో చాలా మందికి తెలియదు. మరి కొంతమందైతే దైవ దర్శనం కాగానే హడావిడిగా వెళ్లి పోతూ ఉంటారు. నిజానికి దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంచెం సేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇప్పుడు దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవడానికి గల శాస్త్రీయమైన కారణాలను తెలుసుకుందాం.
*గుడి ప్రదేశాల్లో విద్యుత్,అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి 'పాజిటివ్' శక్తి విరివిగా లభ్యం అయ్యే ప్రదేశంలో దేవాలయాలను నిర్మిస్తారు.*
ఈ ప్రదేశం యొక్క కేంద్ర స్థానంలో మూల విరాట్ ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూల స్థానం అంటారు. ఈ మూల స్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి.
*మూల విరాట్ అడుగు భాగంలో వేద మంత్రాలను వ్రాసిన రాగి రేకులను ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి చుట్టు పక్కలకు ప్రసారం చేస్తాయి.*
*భక్తులు ప్రతి రోజు గుడికి వచ్చి సవ్య దిశలో ప్రదక్షిణలను చేస్తే, ఆ వ్యక్తి యొక్క శరీరం, మూల విరాట్ అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేసే అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది.*
ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది. అందువల్ల మన పెద్దవారు ప్రదక్షిణ చేసే సమయంలో నిదానంగా, ప్రశాంతంగా చేయాలని చెబుతూ ఉంటారు. ఈ ధనాత్మక శక్తి మనం ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.
*గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు,శరీరం ఉత్తేజితం అవుతాయి.
గుడిలో దేవుని మహిమ, మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతాయి.*
అలాగే చెడు ఆలోచనలు కలుగకుండా మంచి నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రోత్సాహం కలుగుతుంది.
*దైవ సన్నిధిలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి మెరుగు అయ్యి రెట్టింపు ఫలితాలను పొందుతాం.*
*అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెం సేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.*
Comments
Post a Comment