ఈ నలుగురితో జీవితంలో శత్రుత్వం పెట్టుకోవద్దు.. ఎందుకో తప్పక తెలుసుకోండి..
రామాయణంలో శ్రీ రాముడు.. రావణ సంహారం చేసిన సమయంలోనిది ఈ విశేషం.. రావణుడు కొన ఊపిరితో ఉండగా… రాముడు తన తమ్ముడు లక్ష్మణుడితో ఇలా చెబుతాడు.. బ్రాహ్మణుల్లోని పండితుడైన రావణుడి దగ్గరకు వెళ్లి, ఎవరికీ తెలియని నాలుగు మంచి విషయాలు తెలుసుకోమని చెబుతాడు. అప్పుడు రావణుడు ఏమి చెప్పాడంటే…
✽ మన రధసారథితో, కాపలావాడితో, వంట వాడితో నీ తమ్ముడితో ఎప్పుడు స్నేహంగానే మెలగాలి. వాళ్ళతో గాని శతృత్వం పెట్టుకుంటే, వారు ఎప్పుడైనా , ఎటునుంచి అయినా మనకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు మన ప్రాణాలు తియ్యడానికి కూడా వెనకాడరు.
✽ నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు.
✽ నీ శత్రువు చిన్నవాడు, తక్కువ వాడు అని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఎవరి వెనుక ఎంత బలం ఉందొ ఎవరికి తెలుసు. నేను హనుమంతుడిని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను.
✽ దేవుణ్ణి ప్రేమించొచ్చు లేదా ద్వేషించొచ్చు. కాని ఏదైనా కూడా అపారమైన దృడ నిశ్చయంతో ఉండాలి.
✽ రాజుకు యుద్ధం లో గెలవాలని కోరిక ఉండాలి కాని ఎప్పటికీ అత్యాశాపరుడై ఉండకూడదు.
✽ సైన్యానికి అవకాశం ఇచ్చి, రాజు అలసిపోకుండా పోరాడతేనే విజయం సొంతం అవుతుంది.
ఈ మాటలు చెబుతూ ప్రాణాలు వదిలేస్తాడు రావణుడు. ఆయన చెప్పిన మాటలు మన జీవితానికి కూడా వర్తిస్తాయి. ఎంతో విలువైనవి రావణుడు ఆ సమయంలో చెబుతాడని, అవి లోకానికి ఉపయోగపడతాయనే రాముడు లక్ష్మణుడిని వెళ్లి తెలుసుకోమని ఉంటాడు. ఇప్పుడు మనం తెలుసుకుని నలుగురికి తెలియజేద్దాం..
Comments
Post a Comment