Skip to main content

చరిత్రలో ఈ రోజు / జులై 1

చరిత్రలో ఈరోజు / జులై 1

సంఘటనలు

1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ  ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.

1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.

1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1 వతారీకున ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు

1946: అర్నాద్, అర్నాద్ ప్రసిద్ధి చెందిన దుంప హరనాథరెడ్డి ప్రముఖ తెలుగు నవలా రచయిత.50 కి పైగా రచనలు చేసాడు

1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఛట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ) మరియు ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని  జరుపుకుంటున్నారు.

1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం  పాలన అంతమయ్యింది.

1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.

1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.

1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957  సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది

1960: ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి  స్థాపించబడింది.

1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.

1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.

1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.

1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది.

2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.

జననాలు

1646: గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (మ.1716)

1882: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన ప్రముఖ వైద్యులు. (మ.1962)

1904: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)

1905: రాప్తాటి ఓబిరెడ్డి, అజ్ఞాతకవి.

1909: ఇంటూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)

1911: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (మ.2002)

1912: కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత. (మ.1972)

1913: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (మ.1964)

1916: షేక్ దావూద్, ప్రముఖ కవి, విద్వాంసుడు. (మ.1994)

1919: టి.ఎన్.విశ్వనాథరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.

1923: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (మ.1980)

1926: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996)

1927: బొడ్డుపల్లి పురుషోత్తం, ప్రముఖ రచయిత, తెలుగు ఆచార్యుడు.

1928: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (మ.2015)

1929: ఏ.ఎం. రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (మ.1989)

1930: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (మ.1997)

1931: యస్.రాజన్నకవి, రంగస్థల నటుడు.

1933: దరియా హుస్సేన్‌ షేక్‌, అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి1934: వంగపండు అప్పలస్వామి, తెలుగు కవి మరియు రచయిత.

1937: పడాల బాలకోటయ్య, ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015)

1939: కొలకలూరి ఇనాక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి1941: డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్‌సభ సభ్యులు.

1946: కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త.

1946: శాంతి నారాయణ కథారచయిత, అవధాని.

1949: వెంకయ్య నాయుడు., భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు.

1955: పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, ప్రముఖ నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.

1960: అనురాధా నిప్పాణి, ప్రముఖ రంగస్థల నటి, దర్శకురాలు మరియు రచయిత.

1961: ప్రిన్సెస్ డయానా (వేల్స్ యువరాజు ఛార్లెస్ భార్య), నార్ ఫ్లోక్ (ఇంగ్లాండు) లోని సాండ్రిన్గాం.

మరణాలు

1839:మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు. (జ.1785)

1962: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన ప్రముఖ వైద్యులు. (జ.1882)

1966: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921)

1991: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు మరియు మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)

1992: తాతినేని ప్రకాశరావు, సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకులు. (జ.1924)

2006: కొరటాల సత్యనారాయణ,ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడు.

*♦జాతీయ /అంతర్జాతీయ దినాలు*♦

🔻జాతీయ వైద్యుల దినోత్సవం - 

🔻బి.సి.రాయ్ జయంతి మరియు వర్ధంతి దినం.

🔻ఛార్టర్డ్
అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశంలో

🔻వాస్తు దినోత్సవం.

🔻ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.

🔻GST దినోత్సవం.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...