Skip to main content

నీతి కథలు - ఆ (హా) కలీ!

               😪 *ఆ (హా) కలీ!*😪    
              
       (భిక్షగాడి కథ)

      అది ఒక పెద్ద మర్రి చెట్టు. అది భూమాతకు ఎండ వడ తగలకుండా గొడుగు పట్టిందా అన్నట్లు బాగా విస్తరించి ఉంది. దాని మొదలు దగ్గర చిన్న అరుగు. దాని ప్రక్కనే దిగుడు మెట్ల బావి. అది ప్రాచీన నాగరికతకు చిహ్నంలా నిలిచి ఉంది. అది కొండవాలు ప్రాంతంలో ఉన్నందునేమో అందులో నీటివూట ఉంది.
      చెట్టు క్రిందనున్న అరుగుపై ఒక మానవ దేహం. చూసేవారికి అది నిర్జీవం అనిపిస్తుంది. కానీ ఈగల మూకలు చేసే అలజడిని భరించలేని శరీరం  అప్పుడప్పుడూ కదులుతూ ఉంది.
      సూర్యుడు తన ప్రయాణంలో అలసిపోయి ఒకచోట ఆగిపోయినట్టు ఉన్నాడు. భూగోళంపై మానవులు తమ స్వార్థం కోసం, ఆధిపత్యం కోసం పర్యావరణంపై చేస్తున్న చేష్టలపై తీక్షణ దృష్టిని సారించినట్టున్నాడు.
      అత్తమీద కోపం దుత్తమీద పడ్డట్టు ఆ వేడిని భరించలేని పక్షులు చెట్లకొమ్మలను ఆశ్రయిస్తున్నాయి. అవి తమ కూనలతో కలిసి చేసే వింతవింత శబ్దాలకు చెట్టు క్రింద నున్న మనిషిలో చలనం కలిగింది. భారంగా కనులు తెరిచి పడుకునే కలయ జూశాడు. చెట్టు ఆకుల సందుల్లోంచి వచ్చిన సూర్యకిరణాలు కళ్ళపై పడడంతో కనులు తలుక్కుమన్నాయి. కర్తవ్యం స్ఫురించింది. చేతుల ఆధారంతో కష్టంగా లేచి నిలబడ్డాడు.
     తైల సంస్కారం లేని, అట్టలు కట్టిన జుట్టు, ఒంట్లో సత్తువ లేదని చూడటంతోనే తెలిసిపోయేలా లోతులో నున్న కళ్ళు. పీక్కు పోయిన ముఖం. స్నానం చేసి ఎన్నాళ్ళయ్యిందో ఏమో! దుర్గంధభూరితమైన శరీరంపై వేళాడుతున్న బట్టలు. అక్కడక్కడా ఉన్న పుండ్లపై చిరిగినా బట్ట కట్టినా రసికారుతూ చూపరులకు ఆ మనిషి వికృతంగా ఉన్నాడు.
      తలక్రింద దిండుగా పెట్టుకున్న జోలెను తీసుకుని భుజానికి తగిలించుకున్నాడు. ప్రక్కనే పెట్టుకున్న సత్తుపళ్ళేన్ని  అందులో పెట్టుకున్నాడు. అరుకుకు ఆనించి పెట్టుకున్న కర్రను తీసుకుని దగ్గరలోనే ఉన్న కుగ్రామానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
      అప్పటికే అన్నం తిని రెండురోజులయ్యిందేమో! మనిషి నీరసంగా త్రాగినవాడిలా తూలుతూ నడుస్తున్నాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక భుజాన వేసుకున్న జోలెను తీసి తలపై పెట్టుకున్నాడు. కాళ్లు కాలుతున్నా లెక్కచేయక ప్రయాణిస్తున్నాడు. ఏదో గొణుగుతున్నాడు. బయటకు శబ్దం రావడంలేదు.
      ఊరిలోనికి వచ్చేశాడు. ఇప్పుడతని ముఖంలో కొంత తృప్తి. 

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...