Skip to main content

ఆధ్యాత్మిక కాలక్షేపం

☀ సిద్ధపురుషులకు మరియు  సామాన్యులకు వ్యత్యాసం ☀

☘  అది ప్రభాత వేళ ,బాల భానుడు సర్వ ప్రాణికోటికి అభయాన్నిస్తూ ఉదయిస్తున్న వేళ , గురువుగారి దర్శనానికి శిష్యులందరు ఆత్రంగా ఎదురుచుస్తున్న వేళ , కోటిసూర్య తేజోవిరాజితోడైన గురుదేవులు శిష్యులనుద్దరించుటకు గురుకులానికి రానే వచ్చాడు , అందరు శిష్యులు ఆయొక్క  'జ్ఞానమూర్తికి' నమస్కరించి గురుబోధను వినుటకు సిద్ధమయ్యారు ....

  ☘ అంతట , తొలకరి చినుకుకోసం ఎదురుచుస్తున్న కరువునేలలా ,సందేహ నివృత్తికోసం ఎదురుచూస్తున్న శిష్యుడిని చూసి ,,,, 

  🌻 గురువుగారు శిష్యుడితో : -    నాయనా ....!!!! ఏమి నీ విచారం ...????

  🌻  శిష్యుడు :- తండ్రీ ....!!! మానవుల్లో సామాన్యులెవరో ,సాధకులెవరో గుర్తెరుగలేక సతమతమవుతున్నాను , మీరే నాకు దిక్కు ....

  🌻 గురువు :-  సరే , అలావెళ్లి  ఒక పెద్ద గాజు తొట్టినిండా  నీరు నింపుకొని తీసుకురా ....

  🌻 శిష్యుడు :- తెచ్చానండి ....

  🌻  గురువు  :-  ఇప్పుడు చిన్న చిన్న డబ్బాలలో నీళ్లు నింపి మూత గట్టిగా బిగించి , ఆ డబ్బాలను తొట్టిలో వేయి ...

   🌻శి : వేసానండి ....

   🌻 గు : ఏమి గమనించావు ....????

   🌻 శి : అన్నీ డబ్బాలు నీటిపై  తేలుతున్నాయి ....

   🌻గురువు  : అలా తేలుతున్న డబ్బాలే సామాన్యులు , ఇప్పుడు కొన్ని డబ్బాలకు అడుగునా మరియు పైన సూదితో రంధ్రాలు చేసి మళ్ళీ నీటిలో వేసి ఏమి గమనించావో చెప్పు ....????

   🌻శిష్య  : పైన, క్రింద రంధ్రాలు చేయబడ్డ డబ్బాలు నిశ్చలంగా నీటి అడుగున చేరి స్థిరంగా వున్నాయి , మిగతావి మాత్రం అలాగే ఇష్టం వచ్చినట్లు నీటిపై తేలుతూ ఉన్నాయి ...

   🌻గురువు :-  ఈ రెండురకాల డబ్బాల మధ్య గల తేడాయే సామాన్యులకి ,సాధకులకు గల తేడా .....

  🌻శిష్యుడు :-  అర్థంకాని ఆశ్చర్యకరమైన ముఖంతో అలానే ఉండిపోయాడు ....!!!! 

     🌻🌻🌻 గురుబోధ :-

                                      నాయనా ...!!!   * తేలియాడుతున్న   డబ్బాలు మనుషులు ,అందులోని నీరు జీవాత్మ , 

* గాజుతొట్టి సమస్త విశ్వం , అందులోని నీరు పరమత్మ . 

   ☀ 1)తేలియాడుతున్న డబ్బాలలోఉన్న నీటికి తొట్టిలో నీటికి సంబంధం లేదుకాబట్టే అవి క్రమశిక్షణారాహిత్యంగా తెలుతున్నాయి ,అనగా మనషిలోని  జీవాత్మ విశ్వంలోనీ పరమాత్మ ఐక్యం కానివారు సామాన్యులు,అధర్మంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తారు ....

     ☀ 2) ఎప్పుడైతే డబ్బాలకు క్రిందా,మీదా రంధ్రాలు చేసావో అప్పుడు డబ్బాలోని నీరు తొట్టిలోని నీరు ఐక్యమయ్యి డబ్బాలు స్థిరంగా అడుగున చేరాయి . అనగా ఏ మనిషికైతే తన నిరంతర సాధన వల్ల 

క్రింద 'మూలాధారం' పైన 'సహస్రారం' విచ్చుకోబడి తనలోఉన్న జీవాత్మ , విశ్వంలో ఉన్న పరమాత్మతో  ఐక్యమవుతుందో వారే "సిద్ద పురుషులు" ఆయొక్క స్థితియే "అహం బ్రహ్మా2స్మి " అదే అద్వైత సిద్ధి ....

  🌻శిష్యుడు : అమితానందంతో ....!!! గురుపాదాల చెంతకు చేరాడు,జ్ఞానసిద్ధిని పొందాడు , ధన్యుడయ్యాడు  ......

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...