Skip to main content

ప్రసిద్ధినాట్యాచార్యుడు..ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ ఛైర్మన్.."నటరాజ రామకృష్ణ"

🎉💃🏻🕺➖➖➖➖➖➖➖➖
*ప్రసిద్ధినాట్యాచార్యుడు..ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ ఛైర్మన్.."నటరాజ రామకృష్ణ" జయంతి  సందర్భంగా..*✍
➖➖➖➖➖➖➖➖🌸🌸🌸
■డాక్టర్ నటరాజ రామకృష్ణ  ఆంధ్రనాట్యము,  పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు.ఆజన్మ బ్రహ్మచారి. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. 

■ఆంధ్రనాట్యము ఒక పురాతన  లాస్య నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే పేరిణి  శివతాండవం ఉండేది. ప్రబంధ నాట్య సంప్ర దాయానికి సంబంధించిన నవజనార్దనం  గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం లోని కుంతీమాధవ మందిరంలో ప్రదర్శింపబడు తోంది.  

*🔻గురువులు,నాట్య ప్రస్థానం..👋🏻* 

■ ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో మార్చి 31,1933న జన్మించిన నటరాజ రామకృష్ణకు చిన్ననాటినుంచే నాట్యం పట్ల ఆసక్తి కలిగింది. ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కళాసాధన చేశాడు. కుటుంబాన్నీ, సంపదల్నీ వదిలి నాట్యంకోసం జీవితాన్ని అంకితం చేశాడు.ఆయన తనలోని కళాతృష్ణాన్వేషణ లో ఎందరో గురువులను కలుసుకొని, వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నాడు. వారిలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీమతి నాయుడుపేట రాజమ్మ, మరియు పెండెల సత్యభామలు ఉన్నారు. 

*■ఆయన ఇచ్చిన నాట్య ప్రదర్శనలు-*
*శ్రీ వేంకటేశ్వర కల్యాణం' కుమా ర సంభ*
*వము మేఘసందేశం'.ఉజ్జయిని లో  ప్రదర్శింపబడిన కుమార సంభవానికి  స్వర్ణకలశం లభిం చింది. నటరాజ రామకృష్ణ వ్రాసిన నలభై పైచిలుకు పుస్తకా లలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది. వాటిలో దాక్షిణాత్యులనాట్యకళాచరిత్ర, ఆంధ్రులు -నాట్యక ళారీతులు  ప్రసిద్ధ గ్రంథాలు.* 

*■ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కి ఒకప్పుడు ఛైర్మన్‌గా ఉండిన డాక్టర్ నటరాజ రామకృష్ణ గత యాభై ఏళ్ళుగా నాట్యకళను ముందుకు నడిపించాడు. ఆంధ్ర నాట్యానికి ప్రత్యేకమైన  సాత్వికాభినయము చేయడంలో డాక్టర్ నటరాజ రామకృష్ణ ఉద్ధండుడు.*

*🔻అవార్డులు, పురస్కారాలు..🏆🏅

*1. నటరాజ :*తన 18 వ ఏట, రాజా గణపతి రావు పాండ్య చే ప్రదానం చేయబడింది.
*2. భారత కళాప్రపూర్ణ :* 1968 లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచే.
*3. భారతకళా సవ్యసాచి :*1979 లో పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం చే.
*4. కళాప్రపూర్ణ :* 1981 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి.
*5. కళాసరస్వతి :* 1982 లో హైదరాబాదు లోని కళావేదిక ద్వారా.
*6. దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు :*1984 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ద్వారా.
*7. ఉత్తమ పరిశోధకుడు :* 1986 లో ఎల్.వి.ఆర్. ట్రస్ట్, మద్రాసు నుండి - పేరిణీ శివతాండవంపై పరిశోధనకు.
*8. ఆస్థాన నాట్యాచార్యుడు :* 1980 శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్.
*9. ఆస్థాన నాట్యాచార్యుడు :* 1980 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
*10. అరుదైన పురస్కారం :* 1985 లో ఆంధ్రప్రదేశ్ కళాప్రేమికులు ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు.
*11. శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం :* 1991 లో.
*12. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్ :*1995
*13. పద్మశ్రీ :*భారత ప్రభుత్వం చే.
*14. కళాసాగర్ అవార్డ్ :* 1999 లో.
*15. విశిష్ట పురస్కారం :* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ 2000

*🔻విశేషాలు..*

*■ నటరాజ రామకృష్ణ  ఆంధ్రనాట్యం మరియు పేరిణీ నృత్యాల పురోగతికై, లక్షా ఏభై వేల రూపాయలతో నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం సంస్థను నెలకొల్పాడు. దీని ద్వారా వర్ధమాన కళాకారులకు, వృద్ధ కళాకారులకు ధన సహాయం, పింఛను అందజేస్తారు.*

*■నటరాజ రామకృష్ణ లేకపోతే ఆంధ్రనాట్యం,పేరిణీ శివతాండవము ఏనాడో మరుగున పడిపోయేవి. ఆ మధ్య ఆయన శిథిలమవు తున్న హైదరాబాదు లోని  తారామతి  మందిరము  మరియు ప్రేమావతి మందిరము లను బాగు చేయించాడు. ఒకప్పుడు తారామతి మరియు ప్రేమావతులు గోల్కొండ  నవాబు,కుతుబ్ షాహిఆస్థాన నర్తకీమణులు.*

■ అనేకమంది దేవదాసి నృత్య కళాకారిణు
లను సంఘటితం చేసి వారి సాంప్రదాయ నృత్యరీతులను అధ్యయనం చేశాడు.మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీమతి నాయుడుపేట రాజమ్మ,  పెండ్యాల సత్యమాంబ ల వద్ద నాట్య శాస్త్రాన్ని అభ్యసించాడు.

*🔻పుస్తకాలు..*
◆ ఆంధ్ర నాట్యం, జానపద కళానృత్యం, 1987 లో ప్రచురితం

*■ జూన్7,2011వ తేదీన  హైదరాబాదు*
*లోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈయన మరణించాడు.*

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...