Skip to main content

మీకు తెలుసా? పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి? !!


*పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి?*

*జవాబు:*
*పొద్దు తిరుగుడు పువ్వు (దీనిని సూర్యకాంత పుష్పం Sun flower) అని కూడా అంటారు.*
 *సూర్యుడు తూర్పున ఉదయించింది మొదలు సాయంత్రం పడమరలో అస్తమించే వరకు అది సూర్యుని వంకే చూస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటుంది.*
*ఈ పువ్వు ఇలా తిరగడానికి కారణం*樂樂
 ఈ మొక్కలో ఉండే *ఫొటోట్రాపిజం అనే లక్షణమే. ఫొటోట్రాపిజం అంటే, కంటికి కనిపించే సూర్యరశ్మి వలన మొక్క పెరుగుదలతోపాటు కలిగే ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు.*
*పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్‌' అనే హార్మోన్‌ ఈ స్పందనను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్‌ మొక్కలు పొడవుగా, ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. మొక్కల్లో ఉన్న ఎమినో ఆసిడ్‌ (amino acid) వల్లగాని, కార్బోహైడ్రేటులో విచ్ఛిన్నం కావడం వల్ల గాని ఈ హార్మోన్‌ ఏర్పడుతుంది.*
 ఈ హార్మోన్‌ మొక్కలో ఉన్న కణాల గోడలపై ఉన్న కార్బోహైడ్రేటుల బంధాలపై పనిచేస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
*'ఫొటోట్రాపిజం' ధర్మం ఉన్న పొద్దుతిరుగుడు మొక్కపై సూర్యరశ్మి నేరుగా పడినపుడు ఆ మొక్క వెనుక భాగంలో అంటే పువ్వు వెనుక ఉన్న కాండంపై నీడ ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా సోకని ఆ చీకటి భాగాలలో 'ఆక్సిన్‌' హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఆ భాగం వేగంగా పెరుగుతుంది. అందువల్ల ఆ దిశలో మొక్క, దానితోపాటు పొద్దుతిరుగుడు పువ్వు కదులుతాయి. నీడలో ఉండే కాండం పెరిగే కొద్దీ, ఆ పెరుగుదల మొక్కను నీడనుంచి సూర్యరశ్మి పడే దిశలోకి కదిలిస్తుంది.*
 ఫలితంగా పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తూ ఆనందపడుతుంది.

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సింధు నాగరికత - విశేషాలు !!

 సింధు నాగరికత  ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ముఖ్యమైనది. అంతేకాకుండా భారతీయ నాగరికతల్లో ప్రథమమైనది. సర్‌ మార్టిమల్‌ వీలర్‌ ప్రకారం హరప్పా నాగరికత మిగిలిన నాగరికతలన్నింటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో విస్తరించింది. సింధు లోయ ప్రాంతంలో ఆవిర్భవించింది కాబట్టి దీనిని సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. మొదటగా సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు హరప్పాలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. హరప్పా నాగరికతకు దక్షిణాసియాలో మొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానముంది. అందుకే కె.ఎన.దీక్షిత దీనిని ‘మూల భారతీయ నాగరికత’ అని కూడా పేర్కొన్నారు. ఇది కాంస్య యుగానికి చెందిన నాగరికత. ఈ నాగరికత ఉత్తరాన జమ్ము నుంచి దక్షిణాన నర్మదా నది వరకు, పశ్చిమాన బెలూచిస్థానలోని మక్రాన తీరం నుంచి తూర్పున ఉత్తరప్రదేశలోని మీరట్‌ వరకు దాదాపు ఒక మిలియన చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించింది. అంతేకాకుండా భారత-పాక్‌ ఉపఖండంలోని సింధ్‌, పంజాబ్‌, బెలూచిస్థాన, గుజరాత, రాజస్థాన, పశ్చిమ ఉత్తరప్రదేశ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ నాగరికత విస్తరించిన ప్రాంతం ఉత్తరం - జమ్ము దక్షిణం- నర్...