Skip to main content

అసలేంటీ బీఎస్‌-3?

*🏎అసలేంటీ బీఎస్‌-3?*

*🛵ప్రజల ఆరోగ్యం కంటే.. వాహన ఉత్పత్తిదారుల వాణిజ్య ప్రయోజనాలు ఎంతమాత్రం ముఖ్యం కాదు’.. భారత్‌ స్టేజ్‌-3(బీఎస్‌-3) వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ల నిలిపివేత సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. దేశంలో బీఎస్‌-3 వాహనాల అమ్మకంపై నిషేధం విధించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసలేంటీ బీఎస్‌-3? దీనిపట్ల ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు దీన్ని నిలిపివేయాలని కోర్టు ఆదేశించిందో చూద్దాం.*

*🔽ఏమిటీ వాహన ఉద్గార నిబంధనలు?*

*బీఎస్‌-3 అనేది వాహన ఉద్గార ప్రమాణాలకు సంబంధించిన అంశం. దీని ద్వారా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ఎంత స్థాయి వరకు ఉండాలో నిర్ణయిస్తారు. వాయుకాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌ను పరిశీలించేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది.*

*🏍దీని గురించి ఇప్పుడే ఎందుకు?*
 
*దేశంలో ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. అలాంటి వాహనాలనే విక్రయించాలని బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీని ప్రకారం దేశంలో ప్రస్తుతం ఉన్న బీఎస్‌-3 వాహనాలను మార్చి 31లోపు విక్రయించాలని.. ఆ తరువాత కొన్న వాహనాలకు రిజిస్ట్రేషన్లు అనుమతించవద్దని అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో బీఎస్‌-4 ప్రమాణాలకు అనుగుణంగా వాహన అమ్మకాలు జరుగుతున్నాయి.*

*🚘బీఎస్‌-4 అంటే? మిగతా వాటితో దీనికేంటి పోలిక?* 

*బీఎస్‌-3, బీఎస్‌-4 అనేవి వాహనాల ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు. బీఎస్‌-3 నుంచి వచ్చే ఉద్గారాల కంటే బీఎస్‌-4లో విడుదలయ్యే ఉద్గారాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉద్గారాల బట్టే కాలుష్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. బీఎస్‌-3లో కిలోమీటర్‌కు 2.30 గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ వెలువడేందుకు అనుమతి ఉంది. బీఎస్‌-4లో దాన్ని 1గ్రాముకే పరిమితం చేశారు.*

*🚜దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం?*
 
*💠ఇటీవల కాలంలో బీఎస్‌-3 నుంచి బీఎస్‌-4కి మారే క్రమంలో వివాదం నెలకొంది. బీఎస్‌-3 వాహనాల విక్రయానికి ఏప్రిల్‌ 1 గడువుగా నిర్ణయించినప్పటికీ ఆ తరువాత కూడా వాటిని అమ్మేందుకు అమ్మకందారులు యోచన చేశారు. వాహనాల ఉత్పత్తికి మాత్రమే నిషేధం గడువు వర్తిస్తుందని వారు వాదించారు.*

*♨దీని అమలు వెనుక .*. 

*దేశవ్యాప్తంగా బీఎస్‌-4 విధానాన్ని తీసుకురావడానికి ముందు ఇప్పటికే కొన్ని నగరాల్లో దీన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. 2010 నుంచి దిల్లీ, నోయిడాతోపాటు 13 నగరాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడంతో వాయుకాలుష్యాన్ని లెక్కించేందుకు వీలవుతుంది. తద్వారా అమ్మకందారులు, వాహన చోదకులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో దీన్ని దుర్వినియోగం చేసే వీలుండదు. బీఎస్‌-3 వాహనాల కంటే బీఎస్‌-4 వాహనాల్లో కాలుష్యస్థాయి తక్కువగా, సాంకేతికంగా ఇవి బీఎస్‌-3 కంటే మెరుగ్గానూ ఉంటాయి. బీఎస్‌-4 వాహనాల ధర.. బీఎస్‌-3 కంటే అధికంగా ఉంటుంది.*

*🚔ఇంధనం సంగతేమిటి?*

*🛴బీఎస్‌-4 విధానం వలన వాహనాల నాణ్యతే కాకుండా మెరుగైన ఇంధనం కూడా లభ్యం కానుంది. దీనికి పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వశాఖ బాధ్యత వహించనుంది. బీఎస్‌-3 వాహనాలనూ ఈ ఇంధనం ద్వారా నడిపించవచ్చు.*

*🚐ఇప్పుడు ఉత్పత్తి చేసిన బీఎస్‌-3 వాహనాల పరిస్థితేంటి?*
 
*🚕సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో ఉత్పత్తి సంస్థలు ఇప్పుడున్న బీఎస్‌-3 వాహనాల ఇంజిన్‌ను మళ్లీ మార్పు చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం తయారైన వాహనాల విషయంలో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశముండదు.*

*దేశంలో ఉన్న వాహనాల సంఖ్య దేశీయంగా ఉన్న వాహనాల సంఖ్యను పరిశీలిస్తే.🚦*
*పాసింజర్‌ వాహనాలు: 2.79 మిలియన్‌ యూనిట్లు*
 
*కమర్షియల్‌ వాహనాలు: 0.69 మిలియన్లు*

*ద్విచక్రవాహనాలు: 16.50 మిలియన్లు*
 
*తిచక్ర వాహనాలు:0.54మిలియన్లు* 

*మొత్తం: 20.47 మిలియన్‌యూనిట్లు*

*పెరగనున్న వాహనాల ధరలు*

*🚂బీఎస్‌-4 సౌకర్యం కలిగిన వాహనాల ధరలు బీఎస్‌ 3 కంటే దాదాపు 10శాతం వరకు అధికంగా ఉండే అవకాశముంది. ఆయా సంస్థలు, మోడళ్ల బట్టి ఈ పెంపు ఆధారపడి ఉంటుంది.*

*తరువాతేంటి?*

*🚍బీఎస్‌-4 తరువాత బీఎస్‌-5 ను తప్పిస్తున్నట్లు కేంద్రం గత ఏడాది జనవరిలో ప్రకటించింది. తరువాత వచ్చే బీఎస్‌-6 ప్రమాణాలు 2020 నుంచి ప్రారంభం కానున్నాయి.*

Comments

Popular posts from this blog

గిడుగు వెంకట రామమూర్తి - జీవిత విశేషాలు !!

తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు గిడుగు వెంకట రామమూర్తి సంఘ సంస్కర్తలు / ఆధునిక కవులు తల్లిదండ్రులు: వీర్రాజు, వెంకమ్మ స్వస్థలం:పర్వతాలపేట, ముఖలింగ క్షేత్రం, ...

అభ్యుదయ సాహితీ వేత్త - 'ఆరుద్ర' !!

అభ్యుదయ సాహితీ వేత్త..భాగవతుల సదాశివశంకర శాస్త్రి(ఆరుద్ర)గారి వర్దంతి(4-June) ★ అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు ◆ తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర. ◆ శ్రీశ్రీ  తర్వాత యువతరంపై ఎక్కువముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా ప్రముఖ తెలుగురచయిత్రి. ■ ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలోజన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో , తర్వాతవిజయనగరంలోయం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. ■ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. ■ 1947-48 లో చెన్నై నుంచి వెలువడే ప్రముఖ వారపత్రిక ' ఆనందవాణి' కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ , chittooru balaji ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టి...

సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యులు

➖➖➖➖➖➖➖➖ *తెలుగు పదాలతో‘‘శివతాండవం’’ ఆడించిన కవి..సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా చార్యుల జయంతి నేడు..*✍ ➖➖➖➖➖➖➖➖➖ "ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట" ■ ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానంఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు  అభివర్ణించే శివతాండవ కావ్యంయొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు  పుట్టపర్తినారాయణాచార్యులు.నా రాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతు న్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితర సాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులుఅభివర్ణిస్తారు. *■ పద్నాలుగేళ్ల వయసులో  ‘పెనుగొండలక్ష్మి’  అనే పద్యకావ్యాన్ని రచించిఅనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ,  పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించి ‘శివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధం’ వంటి వందకు పైగా గ్...